తెలంగాణ

telangana

ETV Bharat / sports

కోహ్లీ పోస్ట్​.. ధోనీ రిటైర్మెంట్​కు సంకేతమా..! - bcci]

2016 టీ20 ప్రపంచకప్​లో ధోనీతో కలిసి ఆడిన ఇన్నింగ్స్​ను గుర్తు చేసుకున్నాడు టీమిండియా సారథి కోహ్లీ. ఆ ఫొటోను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నాడు. దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు.

ధోనీ

By

Published : Sep 12, 2019, 4:49 PM IST

Updated : Sep 30, 2019, 8:49 AM IST

భారత్ తరఫున గొప్ప ఫినిషర్​గా పేరు తెచ్చుకున్నాడు మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ. అతడు క్రీజులో ఉండి గెలిపించిన మ్యాచ్​లు అనేకం. 2016 టీ20 ప్రపంచకప్​లో​ ఆస్ట్రేలియాతో జరిగిన పోరు​ అందులో ఒకటి. కంగారూ జట్టు నిర్దేశించిన 161 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 94 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది టీమిండియా​. ఈ దశలో కోహ్లీతో కలిసిన ధోనీ.. మరో వికెట్ పడకుండా ఆడి భారత్​కు విజయాన్ని అందించాడు. ఈ మ్యాచ్​లో వీరిద్దరూ వేగంగా సింగిల్స్, డబుల్స్​ తీస్తూ పరుగులు సాధించారు. ఆ సందర్భాన్ని సామాజిక మాధ్యమాల్లో గుర్తు చేసుకున్నాడు కెప్టెన్ కోహ్లీ.

"ఆ గేమ్‌ను ఎప్పటికీ మర్చిపోలేను. ఆరోజు ప్రత్యేకమైంది. పరుగుల విషయంలోఈ మనిషి ఒక పరీక్ష పెట్టాడు. అది ఫిట్‌నెస్‌ టెస్టులా అనిపించింది" -కోహ్లీ, టీమిండియా సారథి

అయితే ఇప్పుడు ఈ ట్వీట్​పై సామాజిక మాధ్యమాల్లో భిన్నస్వరాలు వినిపిస్తున్నాయి. కోహ్లీ ఇలా ఎందుకు పోస్ట్ చేశాడా అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. త్వరలోనేధోనీ రిటైర్మెంట్​ తీసుకునే అవకాశం ఉందని, అందుకే ఇలా చేశాడంటూ కొందరు కామెంట్లు పెడుతున్నారు. అయితే ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ఇవీ చూడండి.. 'ఎల్లవేళలా పాక్​.. శ్రీలంకకు మద్దతిస్తుంది'

Last Updated : Sep 30, 2019, 8:49 AM IST

ABOUT THE AUTHOR

...view details