టీమిండియా క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్మెంట్పై వస్తున్న ఊహాగానాలే ప్రస్తుతం హాట్టాపిక్. ఈ ఏడాది జరిగిన ప్రపంచకప్ తర్వాత అతడు క్రికెట్ నుంచి తాత్కాలిక విరామం తీసుకోవడమే ఇందుకు కారణం. ఆటకు వీడ్కోలు పలికిన తర్వాతఈ క్రికెటర్ ఏం చేస్తాడనే విషయం ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది.
ధోని చూపు బిలియర్డ్స్ వైపు..!
ధోనీ.. ఇటీవలే సొంతూరు రాంచీలోని ఝార్ఖండ్ రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో సందడి చేశాడు. బిలియర్డ్స్ ఆడుతూ కనిపించాడు. ఆటకు రిటైర్మెంట్ ప్రకటించినా తర్వాత ఈ గేమ్ను తన కెరీర్గా ఎంచుకుంటాడేమోనని అభిమానులు అనుకుంటున్నారు.