తెలంగాణ

telangana

ETV Bharat / sports

'టీ20 ప్రపంచకప్​లో ధోనీ ఉండాల్సిందే'

ఈ ఏడాది జరగబోయే టీ20 ప్రపంచకప్​లో భారత్ తరఫున వికెట్​కీపర్​గా ధోనీ ఆడాలని భావిస్తున్నట్లు చెప్పాడు పాక్​ క్రికెటర్​ కమ్రాన్​ అక్మల్​. దీనితో పాటే పలు విషయాల్నిపంచుకున్నాడు.

By

Published : Jun 13, 2020, 2:02 PM IST

kamran
కమ్రన్​, ధోని

లాక్​డౌన్​తో ఇంటికే పరిమితమైన క్రికెటర్లందరూ సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉంటూ అభిమానులను అలరిస్తున్నారు. తాజాగా అభిమానులతో ముచ్చటించిన పాక్ ఆటగాడు​ కమ్రాన్ అక్మల్​​.. ఈ ఏడాది జరగాల్సిన టీ20 ప్రపంచకప్​లో భారత జట్టు తరఫున వికెట్​ కీపర్​గా ధోనీ కచ్చితంగా ఉండాలని అభిప్రాయపడ్డాడు.

"ఈ ఏడాది జరగబోయే టీ20 ప్రపంచకప్‌‌లో టీమిండియా వికెట్‌ కీపర్‌గా ఎవరు ఉండాలని భావిస్తున్నారు?" అన్న ఓ నెటిజన్​ ప్రశ్నకు స్పందించిన కమ్రాన్​.. ఒకవేళ మహీ వికెట్​కీపర్​గా ఉండకపోతే ప్రత్యామ్నయంగా కేఎల్​ రాహుల్​ ఆడాలని అన్నాడు. ప్రస్తుతం కేఎల్​ రాహుల్​ జట్టులో వికెట్​కీపర్​గా కొనసాగుతున్నాడు.

దీంతో పాటు నెటిజన్లు అడిగిన మరకొన్ని ప్రశ్నలకు బదులిచ్చాడు కమ్రాన్​. కోహ్లీ(టీమిండియా సారథి), బాబర్​ (పాక్​) అత్యుత్తమ బ్యాట్స్​మెన్ అని.. అబ్దుల్​ రజాక్​, జాక్వెస్​ కలీస్(దక్షిణాఫ్రికా) అత్యుత్తమ ఆల్​రౌండర్స్​ అని చెప్పాడు.

ప్రస్తుతం కరోనా పరిస్థితుల వల్ల టీ20 ప్రపంచకప్​ నిర్హహణ సందిగ్ధంలో ఉంది. మరోవైపు ఐపీఎల్​​లో సత్తాచాటి ప్రపంచకప్​కు వెళ్లే భారత్​ జట్టులో చోటు దక్కించుకోవాలని ధోనీ భావించాడు. ప్రస్తుతం టోర్నీ నిరవధిక వాయిదా పడిన తరుణంలో అతడి రిటైర్మెంట్​పై ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి.

ఇది చూడండి :'కోహ్లీ ఒక్కడు కాదు.. జట్టు మొత్తంతో సమానం'

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details