మహేంద్రసింగ్ ధోనీ.. భారత క్రికెట్ చరిత్రలో విజయవంతమైన కెప్టెన్గా నిలిచిపోయాడు. ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ను మూడు సార్లు విజేతగా నిలిపాడు. తాజాగా ధోనీపై ప్రశంసల జల్లు కురిపించాడు సహచర ఆటగాడు సురేశ్ రైనా. మహీ ఓ ఉత్తమ కెప్టెన్ అని కొనియాడాడు.
"భారత క్రికెట్ రూపు రేఖల్ని మార్చిన ధోనీ నాకు తెలిసి ఉత్తమ కెప్టెన్. అలాంటి ఆటగాడు చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్గా ఉండటం ఈ జట్టు అదృష్టం."
-సురేశ్ రైనా, టీమిండియా క్రికెటర్
ఈ ఏడాది చెన్నై సూపర్ మరికొంత మంది కొత్త ఆటాగళ్లలో నూతన కళ సంతరించుకుంది. దీనిపైనా స్పందించాడు రైనా.
"ఈ ఏడాది జట్టులో ప్రతిభ గల కొత్త ఆటగాళ్లు ఉన్నారు. పీయూష్ చావ్లా, హెజిల్ వుడ్, సామ్ కరన్, సాయి కిషోర్లతో బౌలింగ్ విభాగం పటిష్ఠంగా తయారైంది. జూనియర్, సీనియర్లతో ప్రస్తుతం జట్టు సమతూకంగా ఉంది."
-సురేశ్ రైనా, టీమిండియా క్రికెటర్
ప్రస్తుతం సురేశ్ రైనా కొంత కాలంగా టీమిండియా జట్టులో చోటు సంపాదించలేకపోతున్నాడు. ఐపీఎల్లో మాత్రం రైనాకు మంచి రికార్డు ఉంది. ఈ సీజన్లోనూ రాణించి టీ20 ప్రపంచకప్లో చోటు సంపాదించాలని భావిస్తున్నాడీ సీనియర్ క్రికెటర్.