తెలంగాణ

telangana

ETV Bharat / sports

సేంద్రీయ వ్యవసాయంలోకి ధోనీ... పుచ్చకాయలు పండిస్తూ బిజీ - క్రికెట్‌ మైదానంలోని సాధన పిచ్‌ను రోలింగ్‌ చేస్తూ ధోని

టీమిండియా మాజీ సారథి ధోనీ.. తనకు దొరికిన ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాడు. ఈ మధ్యే సేంద్రియ వ్యవసాయం మొదలుపెట్టి పుచ్చకాయలు సాగుచేస్తున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్​గా మారింది.

dhoni
సేంద్రియ పుచ్చకాయలు పండిస్తున్న ధోని

By

Published : Feb 27, 2020, 10:18 PM IST

Updated : Mar 2, 2020, 7:33 PM IST

గతేడాది జరిగిన వన్డే ప్రపంచకప్‌లోని సెమీస్‌ తర్వాత టీమిండియా మాజీ సారథి ఎంఎస్‌ ధోనీ నిరవధిక విరామం తీసుకున్నాడు. అప్పటి నుంచి అతడు తనకు దొరికిన ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాడు.

మైదానంలో మహీ కనిపించనప్పటికీ సోషల్‌ మీడియాలో అతడికి సంబంధించిన సమాచారం తెలుస్తూనే ఉంది. గురువారం ధోనీకి సంబంధించిన రెండు వీడియోలు వైరల్‌గా మారాయి. ఒక దాంట్లో క్రికెట్‌ మైదానంలోని సాధన పిచ్‌ను రోలింగ్‌ చేసే వాహనాన్ని నడుపుతూ కనిపించాడు. ఇది రాంచీలోని మైదానంగా భావిస్తున్నారు. కొన్నాళ్లుగా అతడు ఝార్ఖండ్‌ క్రికెటర్లతో కలిసి సాధన చేస్తున్నాడు.

ధోనీకి వేర్వేరు వ్యాపారాలు ఉన్నాయి. ఈ మధ్యే అతడు సేంద్రియ వ్యవసాయం మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. రాంచీకి సమీపంలోని సొంత భూమిలో పుచ్చకాయలు సాగుచేస్తున్నట్టు ఓ వీడియో వైరల్‌ అయింది. అతడి అధికారిక ఫేస్‌బుక్‌ పేజీలో కనిపించింది.

'రాంచీలో సేంద్రియ పుచ్చకాయల సాగును మొదలుపెడుతున్నా. మరో 20 రోజుల్లో బొప్పాయి సాగు చేస్తా. తొలిసారి కావడం వల్ల ఉత్సాహంగా అనిపిస్తోంది"

-ధోనీ, టీమిండియా మాజీ సారథీ.

ఇన్నాళ్లు అభిమానులకు దూరంగా ఉన్న మహీ త్వరలోనే మైదానంలోకి అడుగుపెట్టనున్నాడు. ఐపీఎల్‌ 2020లో చెన్నై సూపర్‌కింగ్స్‌ను నడిపించేందుకు ఉవ్విళ్లూరుతున్నాడు. ఇందుకోసం మరో వారం రోజుల్లో చెన్నై సూపర్‌కింగ్స్‌ శిక్షణ శిబిరంలో చేరనున్నాడు. సీనియర్లు సురేశ్‌ రైనా, అంబటి రాయుడు సహా అందుబాటులో ఉన్న క్రికెటర్లతో కలిసి సాధన చేస్తాడు.

ఇదీ చూడండి : నోరూరించేలా ఫుట్​బాలర్ రొనాల్డో చాక్లెట్ శిల్పం

Last Updated : Mar 2, 2020, 7:33 PM IST

ABOUT THE AUTHOR

...view details