టీమ్ఇండియా అధికారిక వాణిజ్య భాగస్వామిగా ఈ-స్పోర్ట్స్ ప్లాట్ఫామ్ ఎంపీఎల్ ఎంపికైందని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) మంగళవారం ప్రకటించింది. దీంతో పాటు కొత్త కిట్ స్పాన్సర్గానూ ఎంపీఎల్ వ్యవహరించనున్నట్లు బోర్డు తెలిపింది.
ఈనెల నుంచి డిసెంబరు 2023 వరకు మూడేళ్ల పాటు బీసీసీఐ ఈ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఇందులో భాగంగా ఎమ్పీఎల్ రూ.120 కోట్లు చెల్లించనుంది. ఈ డీల్ త్వరలో జరగబోయే ఆస్ట్రేలియా సిరీస్తోనే ప్రారంభం కానుందని బోర్డు వెల్లడించింది.
"2023 వరకు భారత పురుషుల, మహిళల జాతీయ క్రికెట్ జట్టుకు కిట్ స్పాన్సర్గా ఎంపీఎల్ స్పోర్ట్స్ను నియమించడం వల్ల భారత క్రికెట్లో కొత్త శకం ప్రారంభమైనందుకు మేం సంతోషిస్తున్నాం. ఎంపీఎల్ స్పోర్ట్స్ టీమ్ఇండియాకు కొత్త అధ్యాయాన్ని జోడించాలని మేము ఎదురుచూస్తున్నాం"