ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియంగా మొతేరాను తీర్చిదిద్దిన తర్వాత బుధవారం దానికి నరేంద్ర మోదీ స్టేడియంగా పేరు మార్చారు. దీనిపై పలు విమర్శలూ వస్తున్నాయి. అయితే ఇలా స్టేడియానికి ఓ రాజకీయ నాయకుడి పేరు పెట్టడం ఇదేమీ కొత్తకాదు. ఇంతకుముందూ చాలా స్టేడియాలకు ఇలా పేరు మార్చారు. కానీ ఏ ఒక్క క్రికెటర్ పేరు కూడా మైదానాలకు పెట్టకపోవడం గమనార్హం. అలా ఇప్పటివరకు పేరు మారిన స్టేడియాలేంటి? అవి ఏ రాజకీయ నాయకుడి పేరు మీదు ఉన్నాయో చూద్దాం.
మొతేరా టూ మోదీ
ప్రస్తుతం సర్దార్ పటేల్ స్డేడియంగా వెలుగొందుతున్న దీనికి నరేంద్ర మోదీ స్టేడియంగా పేరు మార్చారు. కానీ క్రీడా ప్రాంగణానికి సర్దార్ పటేల్ పేరు కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ ప్రాంగణంలో మొత్తం 20 సముదాయాలు ఉన్నాయి. అందులో ఫుట్బాల్, హాకీ, బాస్కెట్బాల్, కబడ్డీ, బాక్సింగ్, లాన్ టెన్నిస్ వంటి క్రీడా సముదాయాలు ఉన్నాయి. ఇందులో క్రికెట్ స్టేడియం కూడా ఒక భాగం. దీనికి మాత్రమే మోదీ స్టేడియంగా పేరు మార్చారు.
బతికుండగానే స్టేడియాలకు నాయకుల పేర్లు.. ఇదే మొదటిసారా?
కాదు. ముంబయిలోని వాంఖడే (శేష్రావు క్రిష్ణరావు వాంఖడే), బ్రబోర్న్ (లార్డ్ బ్రబోర్న్) స్టేడియాలకు వారు బతికుండగానే నామకరణం చేశారు. అలాగే నేవీ ముంబయిలోని డీవై పాటిల్ (డీవై పాటిల్), బెంగళూరులోని చిన్నస్వామి (చిన్నస్వామి), చెన్నైలోని చిదంబరం (చిదంబరం) స్టేడియాలకు ఆయా రాజకీయ నాయకులు జీవించి ఉండగానే పేర్లు పెట్టారు. ఇంకా 2015లో మొహాలీ క్రికెట్ స్టేడియానికి ఐఎస్ బింద్రా స్టేడియంగా పేరు మార్చారు.
క్రికెటర్ల పేర్ల మీద స్టేడియాలు ఉన్నాయా?
లేవు. ఇప్పటివరకు దేశంలోని ఏ క్రికెట్ స్టేడియానికి క్రికెటర్ల పేర్లు పెట్టలేదు. రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలు, సంగీతకారులు, జనరల్ మేనేజర్ల పేర్ల మీద స్టేడియాలు ఉన్నాయి కానీ క్రికెటర్లకు మాత్రం ఆ భాగ్యం దక్కలేదు.
రాజకీయ నాయకులు.. స్టేడియాల పేర్లు