తెలంగాణ

telangana

డే/నైట్ టెస్టుకు 50 వేల మందికి పైగా

By

Published : Nov 9, 2019, 9:55 PM IST

ఈడెన్ గార్డెన్స్​లో జరగబోయే తొలి డే/నైట్​ టెస్టుకు మొదటి మూడు రోజులు భారీ సంఖ్యలో అభిమానులు హాజరయ్యే అవకాశముందని చెప్పింది కాబ్(బంగాల్ క్రికెట్ అసోసియేషన్).  ఈ నెల 22-26 మధ్య మ్యాచ్​ జరగనుంది.

కోల్​కతా ఈడెన్ గార్డెన్స్ మైదానం

టీమిండియా.. ప్రతిష్టాత్మక డే/నైట్ టెస్టు ఆడేందుకు సిద్ధమవుతోంది. ఈనెల 22-26 మధ్య జరగనున్న ఈ మ్యాచ్​కు.. మొదటి మూడో రోజులు తలో 50 వేల మందికి పైగా అభిమానులు స్టేడియంకు తరలి వచ్చే అవకాశముందని బంగాల్ క్రికెట్ అసోసియేషన్(కాబ్​) భావిస్తోంది. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా పంచుకుంది.​

"భారత్​ తొలి డే/నైట్​ టెస్టుకు మొదటి మూడు రోజులు 50 వేల మందికి పైగా హాజరవుతారని భావిస్తున్నాం. ఇంకా డిమాండ్​ పెరిగే అవకాశముంది" -బంగాల్ క్రికెట్ అసోసియేషన్

అయితే ఈ మొత్తం సంఖ్యలో 17 వేల టికెట్లు ఆన్​లైన్​లో విక్రయిస్తారు. అదే విధంగా స్టేడియం మొత్తం నిండిపోయే అవకాశముందని ఓ అధికారి చెప్పారు.

ఈడెన్ గార్డెన్స్​లో భారత తొలి డే/నైట్ టెస్టు

ఇక్కడ మ్యాచ్​ను ప్రారంభించే ముందు గంట మోగించే సంప్రదాయం ఉంది. ఈ కార్యక్రమానికి బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనా, బంగాల్​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హాజరుకానున్నారు.

ఇందులో భాగంగా భారత దిగ్గజ క్రికెటర్​ సచిన్​ తెందూల్కర్​, ఒలింపిక్​ ఛాంపియన్​ అభినవ్​ బింద్రా, టెన్నిస్​ స్టార్​ సానియా మీర్జా, ప్రపంచ బ్యాడ్మింటన్​ ఛాంపియన్​ పీవీ సింధు, ఆరు సార్లు ప్రపంచ బాక్సింగ్​ ఛాంపియన్​ మేరీకోమ్​లను కాబ్​ సత్కరించనుంది. వీరితో పాటే బంగ్లాదేశ్-భారత్ మధ్య 2000లో జరిగిన తొలి టెస్టు సభ్యులను సన్మానించనుంది.

ABOUT THE AUTHOR

...view details