కరోనా దృష్ట్యా క్రికెట్ మ్యాచ్లను నిర్వహించే సమయంలో జాగ్రత్తలు కచ్చితంగా పాటించాల్సిందే. అందుకోసం ఐసీసీ కొన్ని నిబంధనల్ని కూడా రూపొందించింది. బౌలర్లు, ఫీల్డర్లు బంతికి లాలాజయం రాయకుండా నిషేధించడం అందులో ఒకటి. కానీ ఈ రూల్ను బ్రేక్ చేశాడు పాకిస్థాన్ పేసర్ మహ్మద్ ఆమిర్. ఇంగ్లాండ్తో జరిగిన తొలి టీ20 మ్యాచ్లో బంతికి లాలాజలం రాస్తూ కనిపించాడు.
మాంచెస్టర్ వేదికగా ఇంగ్లాండ్-పాకిస్థాన్ మధ్య తొలి టీ20 జరిగింది. ఈ మ్యాచ్లో బౌలింగ్ చేసేటపుడు ఆమిర్ పదే పదే బంతికి లాలాజలం రాశాడు. ఈ దృశ్యాలు వీడియోల్లో స్పష్టంగా కనిపించాయి. అయితే దీనిని అంపైర్లు కూడా పట్టించుకోకపోవడం గమనార్హం. దీంతో పెనాల్టీ నుంచి పాక్ తప్పించుకుందంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.