తెలంగాణ

telangana

ETV Bharat / sports

సన్​రైజర్స్​ జట్టులోకి రాయ్​ ఎంట్రీ.. మార్ష్​ దూరం - మిచెల్​ మార్ష్

సన్​ రైజర్స్​ ఆల్​రౌండర్​ మిచెల్​ మార్ష్​ ఐపీఎల్​ నుంచి తప్పుకున్నాడు. వ్యక్తిగత కారణాలతో లీగ్​కు దూరమయ్యాడని హైదరాబాద్​ ఫ్రాంచైజీ ప్రకటించింది. అయితే అతని స్థానంలో ఇంగ్లాండ్​ స్టార్ బ్యాట్స్​మన్​ జేసన్ రాయ్ జట్టులో చేరనున్నాడు.

Mitchell Marsh stays away from IPL for personal reasons
వ్యక్తిగత కారణాలతో ఐపీఎల్​కు మిచెల్​ మార్ష్ దూరం

By

Published : Mar 31, 2021, 6:51 PM IST

Updated : Mar 31, 2021, 9:44 PM IST

ఐపీఎల్​ 14వ సీజన్​కు ముందు సన్​రైజర్స్​ హైదరాబాద్​ (ఎస్​ఆర్​హెచ్​)కు శుభవార్త. ఇంగ్లాండ్ ఓపెనర్​ జేసన్​ రాయ్ ఎస్​ఆర్​హెచ్​లో చేరనున్నాడు. ఆస్ట్రేలియా ఆల్​రౌండర్​ మిచెల్​ మార్ష్​ వ్యక్తిగత కారణాలతో ప్రస్తుత లీగ్​కు దూరమయ్యాడు. దీంతో మార్ష్ స్థానంలో రాయ్​ను జట్టులోకి తీసుకుంది హైదరాబాద్​ జట్టు యాజమాన్యం.​

గత సీజన్​లో తొలి మ్యాచ్​లోనే గాయం కారణంగా టోర్నీకి దూరమైన మార్ష్​.. వ్యక్తిగత కారణాలతో ఈ సారి టోర్నీ నుంచి తప్పుకున్నాడు. ఈ విషయాన్ని సన్​రైజర్స్​ ఫ్రాంఛైజీ ట్విట్టర్​ వేదికగా ప్రకటించింది. 2010లో ఐపీఎల్​లో అరంగేట్రం చేసిన మార్ష్​.. ఇప్పటివరకు 21 మ్యాచ్​లాడాడు.

రాయ్​.. తన తొలి ఐపీఎల్​ మ్యాచ్​ను 2017లో గుజరాత్​ లయన్స్​ తరఫున ఆడాడు. 2018లో దిల్లీ డేర్​డెవిల్స్​ (ప్రస్తుతం దిల్లీ క్యాపిటల్స్​)కు ప్రాతినిధ్యం వహించాడు. ఇప్పటి వరకు 8 మ్యాచ్​లాడిన రాయ్​.. 179 పరుగులు సాధించాడు. ఇటీవల వేలంలో రాయ్​ను ఏ ఫ్రాంఛైజీ కొనుగోలు చేయలేదు. ప్రస్తుతం రూ.2 కోట్ల బేస్​ ప్రైజ్​కు అతడ్ని దక్కించుకుంది ఎస్​ఆర్​హెచ్​. ఇటీవల భారత్​తో వన్డే, టీ20 సిరీస్​లో రాయ్​ అద్భుత ప్రదర్శన చేశాడు.

ఇదీ చదవండి:30 మంది అథ్లెట్లకు కరోనా పాజిటివ్​

Last Updated : Mar 31, 2021, 9:44 PM IST

ABOUT THE AUTHOR

...view details