తెలంగాణ

telangana

ETV Bharat / sports

నాలుగో టెస్టులో బుమ్రా.. అలా అయితేనే! - Medical team working with Bumrah

ఆసీస్​తో నాలుగు టెస్టులో బుమ్రా ఆడే విషయం గురించి భారత జట్టు బ్యాటింగ్ కోచ్ మాట్లాడాడు. తుది జట్టును శుక్రవారమే ప్రకటిస్తారని తెలిపాడు.

bumrah
బుమ్రా

By

Published : Jan 14, 2021, 3:30 PM IST

కడుపునొప్పితో బాధపడుతోన్న టీమ్​ఇండియా పేసర్​ బుమ్రాను వైద్యబృందం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుందని టీమ్​ఇండియా బ్యాటింగ్​ కోచ్​ విక్రమ్​ రాఠోడ్ చెప్పాడు. అతడు త్వరగా కోలుకునేందుకు మెరుగైన చికిత్స అందిస్తున్నట్లు తెలిపాడు. ​ఆస్ట్రేలియాతో నాలుగో(చివరి) టెస్టుకు ఇతడు అందుబాటులో ఉండే విషయమై తుది నిర్ణయం శుక్రవారం తీసుకుంటారని అన్నాడు. ఒకవేళ అతడు ఆడగలిగే పరిస్థితిలో ఉంటే తప్పకుండా తుది జట్టులో ఉంటాడని వెల్లడించాడు. మూడో టెస్టు అయిన తర్వాత నుంచి బుమ్రా కడుపునొప్పితో బాధపడుతున్నాడు.

"టీమ్​ఇండియా ఆటగాళ్లకు తగిలిన గాయాలను వైద్యబృందం నిత్యం పరిశీలిస్తూనే ఉంది. నాలుగో టెస్టుకు బుమ్రా ఆడుతాడో లేదో తుది నిర్ణయం శుక్రవారం తీసుకుంటారు. అలానే ఈ మ్యాచ్​కు సంబంధించి తుది జట్టులో ఆడబోయే 11 మంది పేర్లను రేపు(శుక్రవారం) ప్రకటిస్తారు"

-విక్రమ్​ రాఠోడ్​, టీమ్​ఇండియా బ్యాటింగ్​ కోచ్​.

నాలుగో టెస్టు జనవరి 15 నుంచి బ్రిస్బేన్​ వేదికగా ప్రారంభం కానుంది. ఇప్పటికే ఈ మ్యాచ్​కు బౌలర్లు షమి, ఉమేశ్, ఇషాంత్​తో పాటు కేఎల్ రాహుల్, జడేజా, విహారి గాయాల కారణంగా దూరమయ్యారు. ఇరు జట్లు చెరో మ్యాచులో గెలిచి 1-1తో సిరీస్​ను సమంగా ఉన్నాయి. మూడో టెస్టు డ్రాగా ముగిసింది. చివరి మ్యాచులో నెగ్గి సిరీస్​ను సొంతం చేసుకోవాలని భారత్-ఆసీస్ పోటాపోటీగా ఉన్నాయి.

ఇదీ చూడండి : మూడో టెస్టు: బుమ్రా, సిరాజ్​పై జాతి వివక్ష వ్యాఖ్యలు

ABOUT THE AUTHOR

...view details