టీ20 ప్రపంచకప్ జరుగుతుందా? లేదా? అనే సందేహాలు వస్తున్న నేపథ్యంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు ఇంగ్లాండ్ క్రికెటర్ జేసర్ రాయ్. సన్నద్ధమయ్యేందుకు తగిన సమయం లేకపోతేనే టోర్నీని వాయిదా వేయాలని, ఒకవేళ పరిస్థితి కుదుటపడితే, మైదానంలోకి దిగేందుకు ఆటగాళ్లకు మూడు వారాలు చాలని అభిప్రాయపడ్డాడు. ఓ క్రికెట్ వెబ్సైట్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా ఈ విషయాల్ని చెప్పాడు.
'ప్రపంచకప్ కోసం మూడు వారాల ప్రాక్టీసు చాలు' - టీ20 ప్రపంచకప్ తాజా వార్తలు
ప్రస్తుత పరిస్థితి చక్కదిద్దుకుంటే, టీ20 ప్రపంచకప్నకు సిద్ధమయ్యేందుకు తమకు మూడు వారాలు చాలని అన్నాడు ఇంగ్లీష్ క్రికెటర్ జేసన్ రాయ్.

ఇంగ్లాండ్ క్రికెటర్ జేసన్ రాయ్
"ఆటగాళ్లకు సరైన సన్నద్ధత లేకపోయినా, ఆస్ట్రేలియాకు వెళ్లలేని పరిస్థితి వచ్చినా.. ప్రపంచకప్ను వాయిదా వేస్తే బాగుంటుంది. ఒకవేళ అంతా సద్దుమణిగితే, ప్రాక్టీసు అయ్యేందుకు మాకు మూడు వారాలు చాలు. టీ20 ప్రపంచకప్ ఆడేందుకు మేం సిద్ధమైపోతాం. అయితే స్టేడియంలో ప్రేక్షకులు లేకుండా ఆడించాలని బోర్డులు భావిస్తే అది మంచి నిర్ణయమే" -జేసర్ రాయ్, ఇంగ్లాండ్ క్రికెటర్
కరోనా ప్రభావం తీవ్రమవుతుండటం వల్ల ఆస్ట్రేలియా వేదికగా ఈ ఏడాది అక్టోబర్ 18-నవంబర్ 15 మధ్య జరగాల్సిన టీ20 ప్రపంచకప్పై సందిగ్ధత నెలకొంది.