తెలంగాణ

telangana

By

Published : Nov 19, 2019, 6:02 PM IST

ETV Bharat / sports

క్రికెట్​ కోచ్​గా అవతారమెత్తిన సచిన్​ తెందూల్కర్​..!

దిగ్గజ క్రికెటర్​ సచిన్​ తెందూల్కర్​ శిక్షకుడి అవతారం ఎత్తాడు. నేపాల్​లోని మహిళా క్రికెటర్లకు మనోవికాస తరగతులు నిర్వహించాడు. ఇందుకోసం మూడు రోజులు ఆ దేశంలోనే పర్యటించాడు.

క్రికెట్​ కోచ్​గా కనిపించిన సచిన్​ తెందూల్కర్​..!

ఐకరాజ్య సమితి ఆధ్వర్యంలో మహిళా క్రికెటర్లకు మనోవికాస తరగతులు నిర్వహించాడు సచిన్​ తెందూల్కర్​. ఇందుకోసం నేపాల్​లో మూడు రోజులు పర్యటించాడు ఈ స్టార్​ క్రికెటర్​. యునిసెఫ్​ ప్రచారకర్త అయిన సచిన్​... నేపాల్​ మహిళా క్రికెట్​ జట్టుకు పాఠాలు చెప్పాడు.

ప్రధానికి ధన్యవాదాలు...

నేపాల్​లో అడుగుపెట్టిన సచిన్​ను.. ఆ దేశ ప్రధాని కేపీ శర్మ ఓలీ సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ప్రముఖ పశుపతి ఆలయాన్ని సందర్శించాడు సచిన్​. ఈ సందర్భంగా మాస్టర్​ బ్లాస్టర్​ ట్వీట్​ చేశాడు.

నేపాల్​ ప్రధాని కేపీ శర్మ ఓలీ పక్కన సచిన్​

" అనారోగ్యాన్ని లెక్కచేయకుండా నన్ను కలిసేందుకు వచ్చిన నేపాల్​ ప్రధాని శ్రీ ఓలీ గారికి ధన్యవాదాలు. మీరు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాను. నేపాల్​లో అడుగుపెట్టగానే నన్ను సాదరంగా ఆహ్వానించిన మీ ప్రేమాభిమానం నన్ను ఆకట్టుకుంది. మీ దేశ విలువలు ప్రపంచానికి ఓ మార్గదర్శకం".
-- సచిన్​ తెందూల్కర్​

2013 నవంబర్​లో దక్షిణాసియా ప్రచారకర్తగా సచిన్​ను ఎంపిక చేసింది యునిసెఫ్​. ఆటల ద్వారా చిన్నారులు, మహిళల సాధికారతకు తోడ్పడుతున్నాడు ఈ దిగ్గజ క్రికెటర్​.

ABOUT THE AUTHOR

...view details