తెలంగాణ

telangana

By

Published : Apr 28, 2019, 10:57 PM IST

ETV Bharat / sports

ఐపీఎల్​ ఫైనల్​రోజు ఓటు వేయనున్న కోహ్లీ

ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోనున్నాడు విరాట్​ కోహ్లీ. ఈ విషయాన్ని అతడే స్వయంగా తెలియజేస్తూ ఓటర్​ గుర్తింపు కార్డును ఇన్​స్టాలో పంచుకున్నాడు.

ఐపీఎల్​ ఫైనల్​రోజు ఓటు వేయనున్న కోహ్లీ

మే 12వ తేదీన ఐపీఎల్​ ఫైనల్​... అదే రోజు ఓటు హక్కు వినియోగించుకోనున్నాడు విరాట్​ కోహ్లీ. ఈ విషయాన్ని స్వయంగా సామాజిక మాధ్యమం ద్వారా వెల్లడించాడు. గురుగ్రామ్​​లో మే12న ఓటు వేయనున్నట్లు తెలిపాడు... మీరూ ఓటు వేస్తున్నారా అంటూ ప్రజలను అడిగాడు.

కోహ్లీ ఓటర్​ కార్డు

దరఖాస్తు తిరస్కరణ:

ప్రస్తుతం కోహ్లీ, అనుష్క కలిసి ముంబయిలో ఉంటున్నారు. అక్కడే కొత్త ఇంటిని కొనుగోలు చేశారు. కోహ్లీ ముంబయికి ఓటరు కార్డు మార్చుకునేందుకు దరఖాస్తు చేసుకున్నా...అధికారులు గడువుతేదీ ముగిసిందని తిరస్కరించారు. ఫలితంగా కోహ్లీ హర్యానాలోని గురుగ్రామ్​లో ఓటు వేయనున్నాడు. అనుష్క శర్మ మాత్రం ముంబయిలోని వోర్లీ నియోజకవర్గంలో ఓటు హక్కు వినియోగించుకోనుంది.

ABOUT THE AUTHOR

...view details