తెలంగాణ

telangana

ETV Bharat / sports

దిగ్గజ సచిన్​ను గెలిపించాలంటూ కోహ్లీ విజ్ఞప్తి

లారెస్​ పురస్కారం రేసులో ఉన్న దిగ్గజ సచిన్ తెందుల్కర్​ను గెలిపించాలని, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. అభిమానులను కోరాడు. ట్విట్టర్​లో ఈ విషయాన్ని పంచుకున్నాడు.

By

Published : Feb 10, 2020, 7:56 AM IST

Updated : Feb 29, 2020, 7:57 PM IST

దిగ్గజ సచిన్​ను గెలిపించాలంటూ కోహ్లీ విజ్ఞప్తి
సచిన్ తెందుల్కర్

ప్రతిష్ఠాత్మక లారెస్‌ క్రీడా పురస్కారం రేసులో నిలిచాడు భారత దిగ్గజ క్రికెటర్‌ సచిన్‌ తెందుల్కర్‌. మాస్టర్​ను ఓటు వేసి గెలిపించాలని, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అభిమానులను కోరాడు. ఈ విషయాన్ని ట్విట్టర్​ వేదికగా పంచుకున్నాడు

విరాట్ కోహ్లీ ట్వీట్

2000-2020 మధ్య కాలంలో 'దేశం భుజాలపై మోసిన సందర్భం' పేరుతో లారెస్‌ సంస్థ ఓ ప్రత్యేక పురస్కారాన్ని అందిస్తోంది. ఈ అవార్డుకు నామినేట్‌ అయిన 20 మందిలో సచిన్‌ ఒకడు. 2011 క్రికెట్‌ ప్రపంచకప్‌లో గెలిచినప్పుడు భారత జట్టంతా కలిసి సచిన్‌ను తమ భుజాలపై మోస్తూ స్టేడియంలో ఊరేగించారు. ఈ సందర్భాన్ని సూచిస్తూ.. సచిన్‌ను పురస్కారానికి నామినేట్‌ చేశారు.

ఏమిటీ అవార్డు?

లారెస్‌ సంస్థ ఏటా వివిధ క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన క్రీడాకారులకు పురస్కారాలు అందజేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా క్రీడా రంగంలో ఈ పురస్కారాలకు ప్రత్యేక గుర్తింపుంది. క్రీడాకారులు ఈ అవార్డులను ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావిస్తారు. ఈసారి ఇవ్వబోయే పురస్కారాలు మరింత ప్రత్యేకం. లారెస్‌ క్రీడా అవార్డులు నెలకొల్పి 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా.. 2000-20 మధ్య కాలంలో అత్యంత ప్రభావం చూపిన క్రీడాకారులకు అవార్డులు ఇవ్వనున్నారు.

లారెస్ పురస్కారం

సచినే ఎందుకు

అయిదు పర్యాయాలు ప్రపంచకప్‌లో బరిలోకి దిగి టైటిల్‌ ఆశలు నెరవేర్చుకోలేకపోయిన మాస్టర్‌.. 2011లో తన ఆరో ప్రపంచకప్‌లో కల నెరవేర్చుకున్నాడు. ఆ టోర్నీలో అద్భుత ప్రదర్శన చేశాడు. సచిన్‌ సొంత నగరం ముంబయిలో ఫైనల్‌ ముగిసిన అనంతరం మాస్టర్‌ను కెప్టెన్‌ ధోని సహా ఆటగాళ్లందరూ భుజాలపై మోశారు. క్రికెట్‌ చరిత్రలో ఇదో గొప్ప సందర్భంగా నిలిచిపోయింది. అందుకే దీన్ని లారెస్‌ పురస్కారానికి ఎంపిక చేశారు.

సచిన్​ను భుజాలపై మోస్తున్న విరాట్ కోహ్లీ

ఎంపిక ఎలా?

గత 20 ఏళ్లలో గొప్ప ప్రదర్శనలు చేసిన 20 మంది క్రీడాకారులను అవార్డుకు నామినేట్‌ చేశారు. వీరిలో విజేత ఎవరన్నది ప్రజల ఓటింగ్‌ ద్వారా నిర్ణయిస్తారు. ఈ నెల 10న మొదలైన ఓటింగ్‌ ఫిబ్రవరి 16 వరకు కొనసాగుతుంది. 20 మంది నుంచి 10 మందికి.. ఆ తర్వాత అయిదుగురికి జాబితాను కుదిస్తారు. ఈనెల 17న బెర్లిన్‌లో జరిగే లారెస్‌ 20వ వార్షికోత్సవ వేడుకల్లో విజేతను ప్రకటిస్తారు.

Last Updated : Feb 29, 2020, 7:57 PM IST

ABOUT THE AUTHOR

...view details