అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ).. టెస్టు ర్యాంకింగ్స్ను మంగళవారం ప్రకటించింది. ఇప్పటికే అగ్రస్థానంలో ఉన్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ(928 పాయింట్లు).. ఈ ఏడాదిని అగ్రస్థానంతోనే ముగించాడు. అజింక్య రహానే ఏడో ర్యాంకుకు దిగజారగా.. చెతేశ్వర్ పుజారా 791 పాయింట్లతో నాలుగో స్థానాన్ని పదిలపర్చుకున్నాడు.
ఇటీవలే జరిగిన బంగ్లాదేశ్ సిరీస్లో ఆకట్టుకున్న రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్.. తాజా ర్యాంకింగ్స్లో టాప్-20లోకి దూసుకొచ్చారు. మయాంక్ 12వ స్థానానికి రాగా.. రోహిత్ శర్మ 15వ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. శ్రీలంకతో టెస్టు సిరీస్లో శతకంతో ఆకట్టుకున్న బాబర్ అజామ్ ఆరో స్థానానికి చేరాడు.