తెలంగాణ

telangana

By

Published : Dec 24, 2019, 4:30 PM IST

ETV Bharat / sports

ర్యాంకింగ్స్​: ఈ ఏడాదిని అగ్రస్థానంతో ముగించిన కోహ్లీ

ఐసీసీ ప్రకటించిన తాజా టెస్టు ర్యాంకింగ్స్​లో విరాట్ కోహ్లీ అగ్ర స్థానంలో కొనసాగుతున్నాడు. ఆసీస్ బ్యాట్స్​మన్ స్మిత్ రెండో ర్యాంకులో ఉన్నాడు. బౌలర్లలో బుమ్రా ఆరో స్థానంలో నిలిచాడు. ఆల్​రౌండర్ల జాబితాలో జడేజా రెండో ర్యాంకులో కొనసాగుతున్నాడు.

Kohli ends year on top of ICC Test rankings, Rahane slips to 7th
ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్

అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ).. టెస్టు ర్యాంకింగ్స్​ను మంగళవారం ప్రకటించింది. ఇప్పటికే అగ్రస్థానంలో ఉన్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ(928 పాయింట్లు).. ఈ ఏడాదిని అగ్రస్థానం​తోనే ముగించాడు. అజింక్య రహానే ఏడో ర్యాంకుకు దిగజారగా.. చెతేశ్వర్​ పుజారా 791 పాయింట్లతో నాలుగో స్థానాన్ని పదిలపర్చుకున్నాడు.

ఇటీవలే జరిగిన బంగ్లాదేశ్​ సిరీస్​లో ఆకట్టుకున్న రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్.. తాజా ర్యాంకింగ్స్​లో టాప్-20లోకి దూసుకొచ్చారు. మయాంక్ 12వ స్థానానికి రాగా.. రోహిత్ శర్మ 15వ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. శ్రీలంకతో టెస్టు సిరీస్​లో శతకంతో ఆకట్టుకున్న బాబర్ అజామ్ ఆరో స్థానానికి చేరాడు.

బౌలర్ల విభాగంలో బుమ్రా ఆరో స్థానంలో నిలవగా, ఆసీస్​ పేసర్ కమిన్స్ అగ్ర స్థానంలో కొనసాగుతున్నాడు. ఆల్​రౌండర్ల జాబితాలో రవీంద్ర జడేజా రెండో స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. విండీస్ క్రికెటర్ జేసన్ హోల్డర్ నెంబర్​ వన్​లో ఉన్నాడు.

ఐసీసీ టెస్టు ఛాంపియన్​షిప్​లో 360 పాయింట్లతో భారత్ అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. ఆస్ట్రేలియా(216), పాకిస్థాన్(80), శ్రీలంక(80), న్యూజిలాండ్(60), ఇంగ్లాండ్(56) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

ఇదీ చదవండి: 'ముందు మీ దేశ భద్రత గురించి ఆలోచించండి'

ABOUT THE AUTHOR

...view details