భారత క్రికెట్ జట్టులో స్పిన్నర్లు అంటే అశ్విన్-జడేజా గుర్తొచ్చేవారు ఒకప్పుడు. ప్రస్తుతం ఆ స్థానాన్ని చాహల్- కుల్దీప్ జోడీ భర్తీ చేసింది. కొన్నేళ్లుగా వీరిద్దరూ టీమిండియా విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ జంట అరంగేట్రం చేసినప్పటి నుంచి 159 వికెట్లు తీశారు. దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్ల్లో వీరిద్దరూ బంతితో మాయ చేశారు.ధోనీ, కోహ్లీ, రోహిత్ శర్మ ఇచ్చిన విలువైన సలహాలే ఇందుకు కారణమని చెప్పాడు యజ్వేంద్ర చాహల్.
'మా విజయాలకు ఆ ముగ్గురి సలహాలే కీలకం' - కోహ్లి
టీమిండియా తరఫున కుల్దీప్ యాదవ్తో కలిసి సాధించిన విజయాల్లో ధోనీ, కోహ్లీ, రోహిత్ శర్మ కీలక పాత్ర పోషించారని చెప్పాడు స్పిన్నర్ యజ్వేంద్ర చాహల్.
!['మా విజయాలకు ఆ ముగ్గురి సలహాలే కీలకం'](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3286181-thumbnail-3x2-chahal.jpg)
"కుల్దీప్ నాకు చాలా ఏళ్ల నుంచి తెలుసు. మేమిద్దరం మ్యాచ్లో పిచ్ పరిస్థితులు బట్టి ఎక్కడ బంతి వేయొచ్చా అని కొన్నిసార్లు ధోనీభాయ్ సలహాలు తీసుకుంటాం. అదే విధంగా కోహ్లీ, రోహిత్ శర్మ.. మా బౌలింగ్ మెరుగుపర్చుకునేందుకు సహయపడ్డారు. మా విజయాల్లో ఈ ముగ్గురి పాత్ర కీలకమైనది." - యజ్వేంద్ర చాహల్, టీమిండియా బౌలర్
ఇటీవలే జరిగిన ఐపీఎల్లో బెంగళూరు తరఫున ఆకట్టుకున్నాడు చాహల్. ఈ టోర్నీలో ఆడిన చాలా మంది క్రికెటర్స్ ప్రపంచకప్లోనూ ఎదురవుతారని చెప్పాడీ స్పిన్ బౌలర్. వారికి అడ్డుకట్ట వేసేందుకు ఇది తనకెంతో ఉపయోగపడుతుందని తెలిపాడు.