తెలంగాణ

telangana

ETV Bharat / sports

స్వదేశంలో మరో రికార్డు కొట్టేసిన కోహ్లీ - VIRAT-ROHIT

స్వదేశంలో జరిగిన అంతర్జాతీయ టీ20ల్లో భారత్​ తరఫున 1000 పరుగులు పూర్తి చేసిన తొలి క్రికెటర్​గా నిలిచాడు. కోహ్లీ. వెస్టిండీస్​తో మూడో టీ20లో ఈ ఘనత సాధించాడు.

స్వదేశంలో మరో రికార్డు కొట్టేసిన కోహ్లీ
భారత్​ కెప్టెన్ కోహ్లీ

By

Published : Dec 11, 2019, 8:19 PM IST

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. మరో అరుదైన రికార్డు సృష్టించాడు. ముంబయిలో వెస్టిండీస్​తో మూడో టీ20 జరుగుతోంది. ఈ మ్యాచ్​లో 6 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద, ఈ ఫార్మాట్​లో స్వదేశంలో 1000 పరుగులు చేసిన తొలి భారత క్రికెటర్​గా నిలిచాడు. ప్రపంచ వ్యాప్తంగా ఈ ఘనత సాధించిన వారిలో మూడో ఆటగాడిగా ఘనత సాధించాడు. ఇతడి కంటే ముందు న్యూజిలాండ్‌ క్రికెటర్లు మార్టిన్‌ గప్తిల్‌(1430), కొలిన్‌ మన్రో(1000) ఉన్నారు.

ఈ మ్యాచ్​లో టాస్ ఓడి బ్యాటింగ్​కు దిగింది టీమిండియా. ఓపెనర్లు రోహిత్​ శర్మ, కేఎల్ రాహుల్ ఆకాశమే హద్దుగా చెలరేగారు. ఈ క్రమంలోనే అర్ధసెంచరీలు పూర్తి చేశారు. ప్రస్తుతం భారీ స్కోరు దిశగా సాగుతోంది భారత్.

ఇది చదవండి: అభిమానులూ... పంత్​పై కాస్త దయ చూపండి: కోహ్లీ

ABOUT THE AUTHOR

...view details