తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఐపీఎల్​ మ్యాచ్​ల ముందు ఇకపై జాతీయ గీతం!

వచ్చే ఐపీఎల్​ సీజన్​లో ప్రతి మ్యాచ్​కు ముందు జాతీయ గీతాన్ని ప్లే చేయాలనే ప్రతిపాదన చేసింది కింగ్స్ ఎలెవన్ పంజాబ్. ఈ విషయంపై బీసీసీఐ స్పందించాల్సి ఉంది.

By

Published : Nov 8, 2019, 5:31 AM IST

Updated : Nov 8, 2019, 7:11 AM IST

ఐపీఎల్​ జట్టు కింగ్స్ ఎలెవన్ పంజాబ్.. మరో కొత్త ఆలోచనతో ముందుకొచ్చింది. వచ్చే సీజన్​లో ప్రతి మ్యాచ్​కు ముందు భారత జాతీయ గీతాన్ని ప్లేచేసే ఆలోచన చేయాలని జట్టు సహ యజమాని నెస్​వాడియా, బీసీసీఐకి ప్రతిపాదన పంపారు. అదే విధంగా ఐపీఎల్​ ప్రారంభ వేడుకల్ని రద్దు చేయాలనే ఆలోచన చాలా మంచిదని అన్నారు.

"ఇదో అద్భుతమైన ఆలోచన. ప్రతిసారీ ప్రారంభ వేడుక ఖర్చు చూసి ఆశ్చర్యపోయేవాడిని. దానిని రద్దు చేయాలనే ఆలోచన నిజంగా చాలా మంచిది. అదే విధంగా వచ్చే సీజన్​ నుంచి ప్రతి మ్యాచ్​కు ముందు భారత జాతీయ గీతం ప్లే చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను"

-నెస్​వాడియా, పంజాబ్ జట్టు సహ యజమాని

సాధారణంగా భారత్​ ఆడే అంతర్జాతీయ మ్యాచ్​ల్లో జాతీయ గీతం పాడుతారు. అయితే ఈ లీగ్​లోనూ దీనిని ప్లే చేయాలనే ప్రతిపాదన చేసింది పంజాబ్ జట్టు.

ప్రస్తుతం భారత జాతీయ గీతం ఇండియన్ సూపర్ లీగ్(ఫుట్​బాల్), ప్రొ కబడ్డీ లీగ్​లో ప్లే చేస్తున్నారు.

"ఇండియన్ ప్రీమియర్ లీగ్​ ఉన్నందుకు మనం గర్వపడాలి. అదే విధంగా అద్భుతమైన జాతీయ గీతం మన సొంతం. ఎన్​బీఏ మ్యాచ్​లు జరిగే సమయంలో ప్రతి మ్యాచ్​కు ముందు ఆ దేశపు జాతీయ గీతాన్ని ఆలపిస్తారు" -నెస్​వాడియా, పంజాబ్ జట్టు సహ యజమాని

డిసెంబరు 18న ఐపీఎల్​ వేలం జరగనుంది. వచ్చే ఏడాది ఏప్రిల్​ 1 నుంచి మే 30 వరకు మ్యాచ్​లు జరగనున్నాయి.

ఇది చదవండి: ఐపీఎల్​-2020 ఆరంభ వేడుకలు రద్దు!

Last Updated : Nov 8, 2019, 7:11 AM IST

ABOUT THE AUTHOR

...view details