తెలంగాణ

telangana

ETV Bharat / sports

టీ20ల్లో కర్ణాటక రికార్డు విజయాలకు బ్రేక్​ - పాకిస్థాన్‌ సియల్‌కోట్‌ స్టాలియన్స్‌

టీ20ల్లో కర్ణాటక జట్టు వరుస విజయాలకు బరోడా జట్టు చెక్​ పెట్టింది. ప్రతిష్టాత్మక సయద్​ ముస్తాక్​ అలీ టోర్నీలో.. శనివారం ఇరుజట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్​లో గెలిచిన బరోడా జట్టు.. కర్ణాటక వరుస విజయాల రికార్డుకు బ్రేక్​ వేసింది.

టీ20ల్లో కర్ణాటక రికార్డు విజయాలకు బరోడా బ్రేక్​

By

Published : Nov 9, 2019, 1:48 PM IST

కర్ణాటక జట్టు భారత క్రికెట్‌లో అరుదైన రికార్డు నెలకొల్పిన తర్వాత రోజునే ఆ రికార్డుకు బ్రేక్​ పడింది. వరుసగా 15 టీ20లు గెలిచి చరిత్ర సృష్టించిన కన్నడ జట్టు.. ఈరోజు బరోడాతో జరిగిన మ్యాచ్​లో ఓటమిపాలైంది. సయద్‌ ముస్తక్‌ అలీ టోర్నీలో భాగంగా శనివారం బరోడా, కర్ణాటక జట్లు టీ20 మ్యాచ్‌ ఆడాయి. మొదట బ్యాటింగ్‌ చేసిన బరోడా 4 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. ఆ జట్టు కెప్టెన్‌ కెహెచ్​ దేవ్​ధర్​(52) పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.

అనంతరం లక్ష్య ఛేదనలో నిర్ణీత 20 ఓవర్లకు 182 పరుగులకే పరిమితమైంది కర్ణాటక. ఓపెనర్‌ రోహన్‌ కదమ్‌(57)తో పాటు కేకే నాయర్​ (47) పోరాడినా మిగతా బ్యాట్స్​మన్ విఫలమయ్యారు. ఫలితంగా 14 పరుగుల తేడాతో బరోడా విజయం సాధించింది.

వరుస విజయాలు సాధించిన జట్లు...

  • జట్టు
  • దేశం
  • వరుస విజయాలు
  • కాలం
సియల్‌కోట్‌ స్టాలియన్స్‌ పాకిస్థాన్​ 25 ఫిబ్రవరి 2006-అక్టోబర్​ 2010
కర్ణాటక భారత్​ 15 జనవరి 2018- నవంబర్​ 2019
ఒటాగో న్యూజిలాండ్​ 15 డిసెంబర్​ 2012-సెప్టెంబర్​ 2013
కోల్​కతా నైట్​ రైడర్స్ భారత్​ 14 మే 2014-అక్టోబర్​ 2014
సర్రే ఇంగ్లాండ్​ 13 జూన్​ 2003-ఆగస్టు 2004
అఫ్గానిస్థాన్​ టీ20 జట్టు అఫ్గానిస్థాన్​ 13 మార్చి 2016-మే 2017

భారత్​లో ఒకటి.. ప్రపంచంలో రెండు

గత మ్యాచ్​లో ఉత్తరాఖండ్​పై గెలిచిన కర్ణాటక.. భారత్‌లో వరుసగా అత్యధిక టీ20లు గెలిచిన జట్టుగా మొదటి స్థానంలో, ప్రపంచ క్రికెట్‌ జాబితాలో రెండో స్థానంలో న్యూజిలాండ్‌ సరసన నిలిచింది. కివీస్​కు చెందిన ఒటాగో ఇప్పటికే 15 విజయాలతో సమంగా ఉంది. వీటి కన్నా ముందు పాకిస్థాన్‌ సియల్‌కోట్‌ స్టాలియన్స్‌ వరుసగా 25 టీ20 మ్యాచ్​లు గెలిచి అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. పాకిస్థాన్‌ నేషనల్‌ టీ20కప్ సందర్భంగా 2006-2010 మధ్య కాలంలో ఈ ఘనత సాధించింది.

ABOUT THE AUTHOR

...view details