తెలంగాణ

telangana

By

Published : Jan 14, 2020, 6:02 PM IST

ETV Bharat / sports

నోటి దురుసు అభిమానిపై కివీస్ బోర్డు నిషేధం

గత నవంబర్​లో న్యూజిలాండ్-ఇంగ్లాండ్ మ్యాచ్​లో, ఇంగ్లీష్ క్రికెటర్ ఆర్చర్​పై ఓ అభిమాని వివక్షపూరిత వ్యాఖ్యలు చేశాడు. ఇప్పుడు అతడిని తమ దేశంలో క్రికెట్ చూడకుండా నిషేధిస్తూ, కివీస్ క్రికెట్ బోర్డు నిర్ణయం తీసుకుంది.

Jofra
ఆర్చర్​

అతిగా ప్రవర్తిస్తే, ఐసీసీ నిబంధనలు ఉల్లంఘిస్తే క్రికెటర్లు నిషేధానికి గురవడం సహజమే. అయితే క్రికెటర్​పై వివక్షపూరితమైన వ్యాఖ్యలు చేసినందుకుగానూ ఓ అభిమానిపై నిషేధం విధించింది న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు.

ఇంగ్లీష్ క్రికెటర్ జోఫ్రా ఆర్చర్​పై ఓ అభిమాని.. జాతి వివక్ష వ్యాఖ్యలు చేశాడు. గతేడాది నవంబర్​లో న్యూజిలాండ్- ఇంగ్లాండ్ మధ్య జరిగిన తొలి టెస్టు చివరి రోజు ఆటలో ఈ సంఘటన జరిగింది. ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. అనంతరం అతడిని పోలీసులు అరెస్టు చేశారు.

ఇప్పుడు అతడు ఎలాంటి మ్యాచ్​ చూడకుండా రెండేళ్ల నిషేధం విధించింది కివీస్ బోర్డు. తమ దేశంలో జరిగే అంతర్జాతీయ, దేశవాళీ మ్యాచ్​లకు ఇది వర్తిస్తుంది. 2022 వరకు అతడిపై బ్యాన్​ ఉంటుందని న్యూజిలాండ్ క్రికెట్ ప్రతినిధి ఆంటోనీ క్రుమ్మీ చెప్పారు.

ఇవీ చూడండి.. కష్టాల్లో టీమిండియా.. 30 పరుగుల తేడాలో నాలుగు వికెట్లు

ABOUT THE AUTHOR

...view details