తెలంగాణ

telangana

ETV Bharat / sports

'ధోనీకి వీడ్కోలు మ్యాచ్​ నిర్వహించాలి' - Jharkhand CM on Dhoni's retirement

టీమిండియా మాజీ సారథి ఎంఎస్​ ధోనీకి.. రాంచీలో వీడ్కోలు మ్యాచ్​ నిర్వహించాలని ఝార్ఖండ్​ ముఖ్యమంత్రి హేమంత్​ సోరెన్​ బీసీసీఐని కోరారు. శనివారం.. అంతర్జాతీయ క్రికెట్​కు రిటైర్మెంట్​ ప్రకటించి అభిమానులకు నిరాశ మిగిల్చాడు ధోనీ.

Dhoni
ధోనీ

By

Published : Aug 16, 2020, 9:02 AM IST

అంతర్జాతీయ క్రికెట్​కు రిటైర్మెంట్​ ప్రకటిస్తూ టీమిండియా మాజీ కెప్టెన్​ మహేంద్రసింగ్​ ధోనీ.. శనివారం కీలక నిర్ణయం తీసుకున్నాడు. అయితే, ధోనీకి వీడ్కోలు మ్యాచ్​ నిర్వహించాలని ఝార్ఖండ్​ ముఖ్యమంత్రి హేమంత్​ సోరెన్​ బీసీసీఐని కోరారు.

రాంచీలో పుట్టి పెరిగిన ధోనీ.. రాష్ట్రం తరఫున(అప్పటి బిహార్​లో) దేశవాళీ క్రికెట్ ఆడాడు. బిహార్​, ఈస్ట్​ జోన్​, ఝార్ఖండ్​ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. మహీ తన కెరీర్​లో 131 ఫస్ట్​ క్లాస్​ మ్యాచ్​లు ఆడి.. 7,038 పరుగులు చేశాడు.

''దేశానికి, ఝార్ఖండ్​కు ఎంతో కీర్తి తెచ్చిపెట్టిన మహీ ఇవాళ అంతర్జాతీయ క్రికెట్​ నుంచి తప్పుకున్నాడు. ఇకపై ఆ స్టార్​ క్రికెటర్​ను బ్లూ జెర్సీలో చూడలేం. అయితే, క్రికెట్​ అభిమానుల మనసు ఇంకా వెలితిగానే ఉంది. కాబట్టి, రాంచీలో ధోనీకి వీడ్కోలు మ్యాచ్​ నిర్వహించాలని బీసీసీఐని కోరుతున్నా.''

-హేమంత్​ సోరెన్​, ఝార్ఖండ్​ ముఖ్యమంత్రి

ధోనీ తన కెరీర్​లో 350 వన్డేలు ఆడి.. 10 వేల 773 పరుగులు చేశాడు. ఇక 98 టీ20 మ్యాచ్​ల్లో 37.60 సగటుతో 1,617 పరుగులు సాధించాడు. మరోవైపు ఐపీఎల్​లో సీఎస్కే జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. యూఏఈలో సెప్టెంబరు 19 నుంచి జరగనున్న లీగ్​లో ధోనీ ఆడనున్నాడు.

ధోనీ
ధోనీ

ABOUT THE AUTHOR

...view details