ఫిబ్రవరి 5 నుంచి చెన్నై వేదికగా భారత్-ఇంగ్లాండ్ మధ్య తొలి టెస్టు ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో మొదటి టెస్టు కోసం తన తుది జట్టును ప్రకటించాడు టీమ్ఇండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్. ఇందులో రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ను ఓపెనర్లుగా ఎంచుకోగా, పుజారా, కోహ్లీ, రహానే, పంత్లను మిడిలార్డర్కు ఎంపిక చేశాడు. అక్షర్ పటేల్, రవి అశ్విన్లను స్పిన్నర్లుగా తీసుకున్నాడు.
ఇంగ్లాండ్తో టెస్టుకు జట్టును ప్రకటించిన జాఫర్ - ఇంగ్లాండ్తో టెస్టు జట్టును ప్రకటించిన జాఫర్
భారత్-ఇంగ్లాండ్ మధ్య ఫిబ్రవరి 5న టెస్టు సిరీస్ ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో ఈ జట్టుతో బరిలో దిగితే బాగుంటుందంటూ తన జట్టును ప్రకటించాడు మాజీ ఆటగాడు వసీం జాఫర్.
ఇంగ్లాండ్తో టెస్టు జట్టును ప్రకటించిన జాఫర్
ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ ఎడమచేతి వాటం స్పిన్నర్ చేతిలో ఇబ్బందిపడే అవకాశం ఉందని అందుకే అక్షర్కు చోటు కల్పించానని వెల్లడించాడు జాఫర్. అలాగే పేసర్లుగా బుమ్రాతో పాటు పిచ్ను బట్టి ఇషాంత్ శర్మ, సిరాజ్లలో ఒకరిని ఎంచకోవాలని సూచించాడు. కుల్దీప్ యాదవ్, శార్దూల్లకు కూడా ఇది వర్తిస్తుందని తెలిపాడు.
జాఫర్ జట్టు: రోహిత్ , గిల్, పుజారా, కోహ్లీ, రహానే, పంత్, అక్షర్ పటేల్, అశ్విన్, కుల్దీప్/శార్దూల్, ఇషాంత్/సిరాజ్, బుమ్రా