తీరిక లేకుండా మ్యాచ్లు ఆడుతున్న టీమిండియా సారథి కోహ్లీకి విశ్రాంతినివ్వాలని సెలక్షన్ కమటీ భావిస్తోందని సమాచారం. అందువల్ల బంగ్లాదేశ్తో త్వరలో జరిగే టీ20 సిరీస్లో ఈ ఆటగాడికి రెస్ట్ ఇవ్వనుందన్న వార్తలూ వచ్చాయి. ఈ విషయంపై స్పందించాడు బీసీసీఐ అధ్యక్ష పదవి చేపట్టబోతున్న సౌరవ్ గంగూలీ. నిర్ణయం తీసుకునే హక్కు తనకుందని తెలిపాడు.
"అక్టోబర్ 24న బీసీసీఐ అధ్యక్షుడిగా కోహ్లీని కలుస్తా. అప్పుడు ఈ విషయంపై మాట్లాడతా. విశ్రాంతి తీసుకోవాలనుకోవడం అతడి హక్కు."
-గంగూలీ, మాజీ ఆటగాడు
రోహిత్ శర్మపైనా ప్రశంసలు కురిపించాడు గంగూలీ.