తెలంగాణ

telangana

By

Published : Feb 7, 2020, 5:50 AM IST

Updated : Feb 29, 2020, 11:48 AM IST

ETV Bharat / sports

పాక్​ క్రికెట్ బోర్డుపై షోయబ్ అక్తర్ కౌంటర్లు

తమ దేశ క్రికెట్ బోర్డు.. యువ క్రికెటర్లకు శిక్షణనిచ్చే విషయంలో భారత్​ను చూసి నేర్చుకోవాలని అన్నాడు మాజీ బౌలర్ షోయబ్ అక్తర్. పీసీబీ కౌంటర్లు వేశాడు.

పాక్​ క్రికెట్ బోర్డుపై షోయబ్ అక్తర్ కౌంటర్లు
షోయబ్ అక్తర్

అండర్-19 క్రికెట్ ప్రపంచకప్​లో మంగళవారం జరిగిన సెమీస్​లో పాకిస్థాన్.. యువ భారత్​ చేతిలో ఘోరంగా ఓడిపోయింది. కనీస పోటీ ఇవ్వలేక 10 వికెట్ల తేడాతో ఓడింది. ఈ విషయంపై తాజాగా స్పందించాడు పాక్ మాజీ బౌలర్ షోయబ్ అక్తర్. తమ దేశ క్రికెటర్లకు ఎలాంటి శిక్షణ ఇవ్వాలో.. దాయాది దేశాన్ని చూసి నేర్చుకోవాలని అభిప్రాయం వ్యక్తం చేశాడు.

షోయబ్ అక్తర్

'భారత్ అండర్-19 జట్టు కోచ్​గా రాహుల్ ద్రవిడ్ వంటి అగ్రశ్రేణి క్రికెటర్ ఉన్నాడు. ఓ గొప్ప ఆటగాడు.. కోచ్​గా ఉండాలంటే, అతడి స్థాయికి తగ్గట్లు జీతభత్యాలు ఇవ్వాలి. పాక్ అండర్-19 జట్టు కోచ్​గా ఉంటానంటూ యూనిస్ ఖాన్​ ముందుకొచ్చాడు. కానీ పాక్ క్రికెట్ బోర్డు బేరాలాడింది. మాజీ క్రికెటర్లను ఉపయోగించుకోవడంలో పీసీబీ విఫలమవుతోంది.యువ క్రికెటర్లకు సలహాలిచ్చేందుకు నాతో పాటు మహ్మద్ యూసఫ్, యూనిస్ ఖాన్ సిద్ధంగా ఉన్నారు. మా కోచింగ్​లో శిక్షణ పొంది, ప్రపంచకప్​నకు వెళ్లుంటే ఈ తరహా ప్రదర్శన చేసుండేవారా?' అంటూ పీసీబీ అక్తర్ ప్రశ్నించాడు.

ఇప్పటికే పాక్​కు చెందిన సీనియర్ క్రికెట్ జట్టు.. ప్రమాణాల్ని అందుకోలేక చతికిలపడుతోంది. కోచ్ మిస్బావుల్ హక్.. జట్టులో ఎన్ని సంస్కరణలు తెచ్చినా, క్రికెటర్ల ఆటతీరు మాత్రం మెరుగవడం లేదు.

Last Updated : Feb 29, 2020, 11:48 AM IST

ABOUT THE AUTHOR

...view details