తెలంగాణ

telangana

By

Published : Nov 4, 2019, 5:51 PM IST

Updated : Nov 4, 2019, 6:24 PM IST

ETV Bharat / sports

ఐపీఎల్​లో కొత్త రూల్స్​... సబ్​స్టిట్యూట్​గా 'పవర్​ ప్లేయర్​'...!

బీసీసీఐ ప్రతి ఏటా నిర్వహించే ప్రతిష్టాత్మక లీగ్​ 'ఐపీఎల్'​లో సరికొత్త మార్పులు చోటుచేసుకోనున్నాయి. మ్యాచ్​కు ముందు 11 మందికి బదులు 15 మంది జాబితా ప్రకటించనున్నారు బరిలోకి దిగే ఇరు జట్ల కెప్టెన్లు. అంతేకాకుండా 'పవర్​ ప్లేయర్' అనే కొత్త విధానాన్ని ప్రవేశపెట్టే యోచనలో ఉంది బీసీసీఐ.

ఐపీఎల్​లో కొత్త రూల్స్​... సబ్​స్టిట్యూట్​గా 'పవర్​ ప్లేయర్​'...!

టీ20 క్రికెట్​లోఇండియన్​ ప్రీమియర్​ లీగ్​(ఐపీఎల్)​ను ప్రవేశపెట్టి... కొత్త పంథాను ప్రారంభించింది బీసీసీఐ. ఈ లీగ్​ రాకతో భారత క్రికెట్​లో ఎన్నో మార్పులొచ్చాయి. టీమిండియాలో యువ ఆటగాళ్ల ఎంపికకు ఐపీఎల్​ ప్రదర్శననూ చూస్తున్నారు సెలక్టర్లు. అంతేకాకుండా ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన టోర్నీగా ఇది పేరు తెచ్చుకొని కాసుల వర్షం కురిపిస్తోంది. తాజాగా వచ్చే ఏడాది మరిన్ని మార్పులతో రసవత్తరంగా మారనుందీ ఐపీఎల్​. ఈ మేరకు బీసీసీఐ యాజమాన్యం ప్రణాళికలు రచిస్తోంది.

పవర్​ ప్లేయర్​...

ఈ టీ20 లీగ్​లో కొత్తగా 'పవర్​ ప్లేయర్'​ రానున్నాడు. ఓవర్​ పూర్తయిన తర్వాతైనా, వికెట్​ పడినప్పుడైనా తుదిజట్టులో లేని ఆటగాడిని సబ్​స్టిట్యూట్​గా బరిలోకి దింపవచ్చు. ఎవరికైనా గాయమైనా, జట్టుకు అవసరమైన సమయంలో పవర్​ ప్లేయర్​ను తీసుకురావచ్చు. ఈ ప్రతిష్టాత్మక లీగ్​లో మరిన్ని మార్పులను చేయాలని చూస్తున్నారు లీగ్​ నిర్వాహకులు.

" పవర్​ ప్లేయర్​ పద్దతిని ఇప్పటికే అంతర్గతంగా అందరూ బాగుందని అభిప్రాయపడుతున్నారు. దీనిపై ఐపీఎల్​ గవర్నింగ్​ కౌన్సిల్​ తుది నిర్ణయం తీసుకోనుంది. ముంబయిలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో సభ్యులంతా ఈ విషయంపైమంగళవారం చర్చించనున్నారు."

--బీసీసీఐ వర్గాలు

ఈ నిర్ణయాలతో మ్యాచ్ మరింత ఉత్కంఠగా, ఫలితాలు ఆసక్తికరంగా మారతాయని బీసీసీఐ వర్గాలు భావిస్తున్నాయట.

ఉదాహరణ..

చివరి 6 బంతుల్లో 20 పరుగులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అప్పుడు జట్టులో ఆండ్రీ రసెల్​ ఉన్నాడు. కానీ అతడికి 11 మంది జట్టు సభ్యుల్లో స్థానం దక్కలేదు. ఈ నూతన నిర్ణయంతో రసెల్​నూ తీసుకోవచ్చు. అలాంటి సమయాల్లో ఫలితం తారుమారయ్యే అవకాశాలు ఉంటాయి. ఈ విధానంతో 15 మందీ తుది జట్టులో ఉన్నట్లే.

ఇదే విధంగా 6 పరుగులను కాపాడుకోవాల్సిన పరిస్థితే వచ్చింది. జస్ప్రీత్​ బుమ్రా 11 మందిలో లేకున్నా... అతడి బౌలింగ్​ సేవలను ఉపయోగించుకోవచ్చు. దీని వల్ల ఫలితం ఆసక్తికరంగా ఉంటుందని ఆశిస్తున్నారు బీసీసీఐ, ఐపీఎల్​ నిర్వాహకులు. ఈ ఏడాది ఈ క్యాష్​ రిచ్​ లీగ్ నిర్వహణ, పలు అంశాలపై నవంబర్​ 5న(మంగళవారం) ఈ భేటీ​లో చర్చించనున్నారు. నూతనంగా ఏదైనా మార్పులు చేపట్టాలంటే ఐపీఎల్​ జనరల్​ కౌన్సిల్​ అంతా దీనిపై తుది నిర్ణయం తీసుకుంటుంది. తర్వాత లీగ్​ను ఎలా నిర్వహించాలి..? ఎలాంటి విషయాల్లో మార్పులు చేయాలి, అభిమానులకు మరింత ఆసక్తి కలిగించేలా విభిన్న నిర్ణయాలు తీసుకోనున్నారు బృంద సభ్యులు.

Last Updated : Nov 4, 2019, 6:24 PM IST

ABOUT THE AUTHOR

...view details