తెలంగాణ

telangana

ETV Bharat / sports

మలుపు తిప్పే మొనగాళ్లు... మరో ఫ్రాంఛైజీకి మారారు

2019 ఐపీఎల్ మరో రెండ్రోజుల్లో ప్రారంభంకానుంది. ప్రతి ఏడాది జట్టు నుంచి కొందరు ఆటగాళ్లు మారడం సహజమే. అలాగే ఈసారీ వేరే ఫ్రాంఛైజీల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు ఈ క్రికెటర్లు.

By

Published : Mar 21, 2019, 6:30 PM IST

మ్యచ్​ను మలుపు తిప్పే మొనగాళ్లు...మరో ఫ్రాంఛైజీకి మారారు

సుమారు 106 కోట్ల రూపాయలకు పైగా వెచ్చించి ఈ ఏడాది కొనుగోళ్లకు సిద్ధమయ్యాయి ఫ్రాంచైజీలు. జైపూర్​లో 2018 డిసెంబర్​లో ఐపీఎల్​ 12వ సీజన్​ వేలంపాట జరిగింది. ఇందులో ఐదుగురు ప్రముఖ క్రికెటర్లు ఒక టీం నుంచి మరో టీంకు మారారు.

  • డికాక్​.. బెంగళూరు నుంచి ముంబయి

2019 వేలంపాటలో మొదటి ఆటగాడు దక్షిణాఫ్రికా బ్యాట్స్​మెన్, వికెట్​ కీపర్​ క్వింటన్​ డికాక్​ను 2.8 కోట్లకు దక్కించుకుంది ముంబయి ఇండియన్స్​ యాజమాన్యం. బంగ్లాదేశ్​ ఫాస్ట్​ బౌలర్​ ముస్తాఫిజుర్​ రెహమాన్​ (2.2 కోట్లు), శ్రీలంక ఆఫ్​ స్పిన్నర్​ అఖిల ధనంజయ (50 లక్షలు)ను వదులుకుని ఈ కొనుగోలు చేసింది.
విండీస్​ ఆటగాడు ఎవిన్​ లూయిస్​, సారథి రోహిత్​ శర్మతో పాటు డికాక్​ రాకతో ముంబయి టాప్​ ఆర్డర్​ బలంగా తయారైంది. ఏ స్థానంలోనైనా బ్యాటింగ్​ చేసే సామర్థ్యం ఉన్న ఆటగాడు డికాక్​. ఈ మెగా టోర్నీకి ముందు వన్డేల్లో 5 మ్యాచ్​ల్లో 353 పరుగులు చేసిన ఈ సఫారీ బ్యాట్స్​మెన్​...శ్రీలంకతో సిరీస్​ను​ క్లీన్​స్వీప్​ చేయడంలోప్రధానపాత్ర పోషించాడు.​

  • శిఖర్​ ధావన్​.. సన్​రైజర్స్​ నుంచి దిల్లీ క్యాపిటల్స్​

మొదట దిల్లీ తరఫున ఆడిన ధావన్​​.. ఆ జట్టులో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో గౌతమ్​ గంభీర్​, వీరేంద్ర సెహ్వాగ్​ తర్వాతి స్థానంలో నిలిచాడు. ఈ ఐపీఎల్​లో మళ్లీ సొంత గూటికే చేరాడు.

దిల్లీ క్యాపిటల్స్​ తరఫున శిఖర్​ధావన్​

విజయ్​ శంకర్​, షహ్​బాజ్​ నదీమ్​, అభిషేక్​ శర్మ వంటి ముగ్గురు ఆటగాళ్లను వదులుకొని ఆ ధరకు ధావన్​ను దక్కించుకుంది దిల్లీ క్యాపిటల్స్​. రూ.5 కోట్లతో అక్షర్​ పటేల్​నూ కొనుగోలు చేసింది ఈ ప్రాంఛైజీ .
  • స్టాయినిస్​.. కింగ్స్​ ఎలెవన్ పంజాబ్​ నుంచి రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు

2018 వేలంలో స్టాయినిస్​ను దక్కించుకోలేకపోయిన బెంగళూరు ఈ ఏడాది 6.20 కోట్ల ధరకు కొనుక్కుంది. ఈ ఆస్ట్రేలియా ఆల్​రౌండర్​ కోసం మన్​దీప్​ సింగ్​ను వదులుకుందీ జట్టు.
స్వదేశంలో భారత్- ఆస్ట్రేలియా మ్యాచ్​లో స్టాయినిస్​ అద్భుత ప్రదర్శన చేశాడు. 0-2తో వెనుకబడి ఉన్నఆసిస్​... చివరి మూడు మ్యాచ్​లు గెలిచి సిరీస్​ గెలుచుకోవడంలో ముఖ్య పాత్ర వహించాడు. ఒక మ్యాచ్​లో 140 పరుగులతో ఆకట్టుకున్నాడు. బిగ్​బాష్​ టోర్నమెంటులో మూడో అత్యధిక స్కోరర్​గా నిలవడం బెంగళూరుకు కలిసొచ్చే అంశం.

  • యువరాజ్​ సింగ్​.. పంజాబ్​ నుంచి ముంబయి ఇండియన్స్​

2018 టోర్నమెంటులో ఎనిమిది మ్యాచ్​ల్లో 65 పరుగులు మాత్రమే చేసి నిరాశపర్చిన యువరాజ్​సింగ్​పై ఈ ఏడాది ఏ ఫ్రాంచైజీ పెద్దగా ఆసక్తి చూపలేదు. చివరకు ముంబయి ఇండియన్స్​ కోటి రూపాయల నామమాత్ర ధరకు సొంతం చేసుకుంది. గతంలో 12 కోట్లతో వేలంలో అత్యధిక ధర పలికిన ఈ హిట్టర్​ ఇంత తక్కువ ధర పలకడం ఆశ్చర్యకరం. మంచి అనుభవం ఉన్న ఆటగాడు, మిడిలార్డర్​లో రాణించగలడనే భరోసాతోనే యాజమాన్యం యువీని దక్కించుకుంది.

ముంబయి ఇండియన్స్​ తరఫున యువీ
  • మార్టిన్​ గప్తిల్​, బెయిర్​స్టో....సన్​రైజర్స్​

గప్తిల్​, బెయిర్​ స్టో రూపంలో సన్​రైజర్స్​కు బలమైన ఓపెనర్లు దొరికారు. ధావన్​ లేని లోటు తీర్చేందుకు వీరు ఉపయోగపడతారని ఫ్రాంఛైజీ భావిస్తోంది.

  1. తొలిసారి ఐపీఎల్​ వేలంలో పాల్గొన్న బెయిర్​ స్టోను 2.2 కోట్లకు దక్కించుకుంది సన్​రైజర్స్​. ఈ ఇంగ్లండ్​ ఆటగాడు వికెట్​ కీపర్, బ్యాట్స్​మెన్​గా ప్రభావం చూపించగలడు.
  2. గప్తిల్​ను కోటి రూపాయలకు రెండో రౌండ్​లో కొనుగోలు చేసింది సన్​రైజర్స్. ఈ కివీస్​ ఓపెనర్​ చాలా సీజన్ల తరవాత మళ్లీ ఐపీఎల్​లో అడుగుపెడుతున్నాడు. భారత్​లో గప్తిల్​కు మంచి రికార్డు ఉంది. హిట్టర్​గానూ టీ20ల్లో నిరూపించుకున్నాడీ విధ్వంసకర ఓపెనర్.

ABOUT THE AUTHOR

...view details