తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఐపీఎల్ వేలానికి వేళాయే.. లక్కు ఎవరికి దక్కునో - 322 Players in IPL Auction

13వ ఐపీఎల్ సీజన్​ కోసం వేలం ఈ రోజు నిర్వహించనున్నారు. కోల్​కతా వేదికగా మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ వేలంలో మొత్తం 73 స్థానాలకు 322 మంది పోటీపడుతున్నారు.

IPL Auction Starts Today in Calcutta at 3.30pm
ఐపీఎల్ వేలం

By

Published : Dec 19, 2019, 7:34 AM IST

ధనాధన్‌ క్రికెట్‌కు ముందు ఓ ఆసక్తికర అంకం. ఐపీఎల్‌లో 2020 వేలానికి వేళైంది. కోల్‌కతాలో గురువారమే వేలం పాట. అంతర్జాతీయ స్టార్ల నుంచి.. దేశవాళీ సంచలనాల వరకు చాలా మందే అమ్మకానికి ఉన్నారు. చూద్దాం.. ఏ ఫ్రాంఛైజీ ఎంత తెలివిగా కొంటుందో.. ఏ ఆటగాడి పంట పండుతుందో!

వేలం ఎక్కడ?

వేలం తొలిసారి కోల్‌కతాలో జరగనుంది. మధ్యాహ్నం 3.30కు మొదలవుతుంది. స్టార్‌స్పోర్ట్స్‌లో చూడొచ్చు.

ప్రధాన ఆకర్షకులు ఎవరు?

గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌, ప్యాట్‌ కమిన్స్‌, క్రిస్‌ లిన్‌, మోర్గాన్‌, క్రిస్‌ మోరిస్‌, షిమ్రోన్‌ హెట్‌మయర్‌లు ఈ వేలంలో స్టార్లు. భారీగా పలకవచ్చన్నది అంచనా. భారత్‌ నుంచి రాబిన్‌ ఉతప్ప, ఉనద్కత్‌ల కోసం మంచి పోటీ ఉండొచ్చు.

ఐపీఎల్ వేలంలో ఫ్రాంఛైజీల వద్ద ఉన్న నగదు

కుర్రాళ్లలో ఎవరిపై ఆసక్తి?

ముంబయి ఆటగాడు యశస్వి జయస్వాల్‌ కోసం గట్టి పోటీ ఉండొచ్చు. 17 ఏళ్ల యశస్వి ఇటీవలే లిస్ట్‌-ఎ క్రికెట్లో డబుల్‌ సెంచరీ సాధించిన అతి పిన్నవయస్కుడిగా ఘనత సాధించిన సంగతి తెలిసిందే. వచ్చే నెలలో జరిగే అండర్‌-19 ప్రపంచకప్‌లో అతడు ఆడనున్నాడు. అదే టోర్నీలో భారత్‌కు నాయకత్వం వహించనున్న ప్రియమ్‌ గార్గ్‌ కూడా ఆసక్తి రేపుతున్నాడు. గార్గ్‌కు మంచి స్ట్రోక్‌ ప్లేయర్‌గా పేరుంది. ఇంగ్లాండ్‌కు చెందిన ఓపెనర్‌ టామ్‌ బాంటన్‌కు కూడా మంచి ధర పలకొచ్చు. 21 ఏళ్ల ఈ హార్డ్‌ హిట్టర్‌ ఇంగ్లాండ్‌ తరఫున మూడు టీ20 మ్యాచ్‌లు ఆడాడు.

అతి చిన్న వయస్కుడు నూర్‌.. 14ఏళ్లే

అఫ్గానిస్థాన్‌ చిన్నోడు నూర్‌ అహ్మద్‌ వేలంలో అందరికన్నా చిన్నోడు. ఈ ఎడమచేతి వాటం చైనామన్‌ బౌలర్‌ వయసు కేవలం 14 ఏళ్ల 350 రోజులే. ఇటీవల భారత్‌తో అండర్‌-19 సిరీస్‌లో నూర్‌ మెరుగైన ప్రదర్శన చేశాడు.

బెంగళూరుకు 12 మంది..

అన్ని జట్ల కన్నా అత్యధికంగా బెంగళూరుకు 12 మందిని తీసుకునే అవకాశముంది. వాళ్ల దగ్గర ఉన్న డబ్బు మాత్రం రూ.27.90 కోట్లు. ఓ ఐపీఎల్‌ ఫ్రాంఛైజీలో గరిష్టంగా 25 మంది ఆటగాళ్లు ఉండొచ్చు.

ఉంది 73 స్థానాలే..

ఎనిమిది ఫ్రాంఛైజీలకు కలిపి అందుబాటులో ఉన్న ఖాళీ స్థానాలు. గరిష్టంగా 73 మంది మాత్రమే వేలంలో అమ్ముడు పోతారు. ఇందులో విదేశీ క్రికెటర్ల సంఖ 29 దాటకూడదు.

మొత్తం 322మంది..

వేలంలో ఉన్న మొత్తం 322 మంది అందుబాటులో ఉండనున్నారు. 13 మంది భారతీయులు సహా ఇందులో 134 మంది అంతర్జాతీయ క్రికెట్‌ ఆడిన వాళ్లు. 198 మంది అరంగేట్రం చేయనివాళ్లు ఉన్నారు.

పంజాబ్​ దగ్గర అధిక మొత్తం..

వేలంలో ఓ ఫ్రాంఛైజీ వద్ద అత్యధికంగా ఉన్న మొత్తం రూ. 42.70 కోట్లు. కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ దగ్గర ఈ డబ్బుంది.

ఇదీ చదవండి: ఐపీఎల్​: బలమైన జట్టు కోసం రాయల్ ఛాలెంజర్స్ వేట

ABOUT THE AUTHOR

...view details