కరోనా ప్రభావంతో ఖాళీ స్టేడియాల్లో ఐపీఎల్ నిర్వహణపై బెంగళూరు జట్టు కెప్టెన్ కోహ్లీ మరోసారి మాట్లాడాడు. స్టాండ్స్లో అభిమానులు లేనంత మాత్రాన తమ జట్టులోని ఆటగాళ్లలో జోరు తగ్గదన్నాడు. మునుపటిలానే పోటీతత్వంతో ఆడతామని స్పష్టం చేశాడు.
ఆర్సీబీ ఛైర్మన్ సంజీవ్ చురీవాలా, కోహ్లీ, పార్థివ్ పటేల్, దేవదత్ పడిక్కల్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కరోనా వీరులకు గురువారం నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పలు విషయాల్ని చెప్పాడు విరాట్.
"బయో బబుల్ వాతావరణానికి మేం అలవాటుపడ్డాం. ఇలా ఆడుతున్నందుకు మాకు బాధగా ఏమీ లేదు. ఇప్పటివరకు కరోనా నుంచి ఎన్నో అనుభవాలను నేర్చుకున్నాం" అని కోహ్లీ చెప్పాడు.