తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఐపీఎల్: రాజస్థాన్​​ ఫీల్డింగ్​ కోచ్​కు కరోనా - ఐపీఎల్​ 2020 కరోనా కేసులు

రాజస్థాన్​ రాయల్స్​ ఫీల్డింగ్​ కోచ్​ దిశాంత్​​కు కరోనా సోకింది. బీసీసీఐ నిబంధనల ప్రకారం అతడిని 14 రోజుల నిర్బంధంలో ఉంచనున్నట్లు యాజమాన్యం ప్రకటించింది.

IPL 2020: Rajasthan Royals fielding coach tests positive for COVID-19
రాజస్థాన్​ రాయల్స్​ ఫీల్డింగ్​ కోచ్​కు కరోనా పాజిటివ్​

By

Published : Aug 12, 2020, 1:51 PM IST

రాజస్థాన్​ రాయల్స్​ ఫీల్డింగ్​ కోచ్​ దిశాంత్​ యాజ్ఞిక్​కు కరోనా సోకినట్లు నిర్ధరణ అయ్యింది. జట్టు యాజమాన్యం బుధవారం ఈ విషయాన్ని ట్వీట్ చేసింది. సెప్టెంబరులో యూఏఈ వేదికగా జరగనున్న ఐపీఎల్​ కోసం జట్టులోని ప్రతి ఒక్కరికి కొవిడ్​ పరీక్షలు చేయించడం మొదలు పెట్టిన క్రమంలో దిశాంత్​కు వైరస్​ సోకినట్లు తేలింది.

ఇదే విషయాన్ని తన ట్విట్టర్​లోనూ వెల్లడించాడు​ కోచ్​ దిశాంత్​. పదిరోజులుగా తనను కలిసిన వారిని ముందు జాగ్రత్తగా కరోనా పరీక్ష చేయించుకోమని సూచించాడు. బీసీసీఐ నిబంధనల ప్రకారం తాను 14 రోజుల నిర్బంధంలో ఉంటానని అన్నాడు. త్వరలోనే కోలుకుని రాజస్థాన్​ రాయల్స్​ జట్టుతో యూఏఈ వెళ్తానని చెప్పాడు. ఆటగాళ్లందరికీ కొవిడ్​ పరీక్షలు చేయించిన తర్వాత, ఆగస్టు 20న యూఏఈకి పయనమవ్వాలని ప్రాంఛైజీలు భావిస్తున్నాయి.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details