తెలంగాణ

telangana

By

Published : Jul 2, 2020, 4:48 PM IST

Updated : Jul 2, 2020, 9:34 PM IST

ETV Bharat / sports

దుబాయ్​ లేదా శ్రీలంకలో ఐపీఎల్​-13!

ఇండియన్ ప్రీమియర్ లీగ్.. ఈ ఏడాది భారత్​లో జరగడం కష్టమేనని బీసీసీఐ అధికారి ఒకరు చెప్పారు. రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతుండటమే ఇందుకు కారణమని అన్నారు. త్వరలో ఈ విషయమై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

ఐపీఎల్​ ఈసారి కచ్చితంగా బయట దేశంలోనే!
ఐపీఎల్ 2020

ఐపీఎల్​ 13వ సీజన్.. భారత్​లో జరగడం కష్టంగా కనిపిస్తోంది. అయితే టీ20 ప్రపంచకప్​ నిర్వహణపై ఐసీసీ స్పష్టతనిచ్చిన తర్వాతే దీని విషయంలో నిర్ణయం తీసుకోనున్నారని బీసీసీఐ అధికారి ఒకరు చెప్పారు. మనదేశంలో కరోనా వ్యాప్తి అంతకంతకు పెరుగుతుండటం వల్ల టోర్నీని యూఏఈ లేదా శ్రీలంకలో నిర్వహించాలని బోర్డు భావిస్తోంది.

ఐపీఎల్ ట్రోఫీ

"మేం ఐపీఎల్​ వేదిక గురించి ఇంకా నిర్ణయం తీసుకోలేదు. అయితే ఈసారి కచ్చితంగా బయటదేశంలోనే జరుగుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో అన్ని మ్యాచ్​లను ఒకటి లేదా రెండు మైదానాల్లో, ప్రేక్షకుల లేకుండా జరపాలనే ఆలోచనతో ఉన్నాం. కరోనా ప్రభావం ఎక్కువవుతున్న నేపథ్యంలో వేదిక యూఏఈ లేదా శ్రీలంక అనేది త్వరలో నిర్ణయిస్తాం" -బీసీసీఐ అధికారి

ఇదే విషయమై మాట్లాడిన ఐపీఎల్ ఛైర్మన్ బ్రిజేశ్ పటేల్.. తమ తొలి ప్రాధాన్యం స్వదేశమేనని అన్నారు. అయితే దీని విషయంలో ప్రభుత్వం నుంచి అనుమతి రావాల్సి ఉందని చెప్పారు.

"మూడు, నాలుగు మైదానాల్లో కంటే ఎక్కువ వాటిలో ఐపీఎల్​ మ్యాచ్​లు జరపలేం. అయితే కరోనా వ్యాప్తి ఎక్కువవుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నాం. అభిమానులు లేకుండా టోర్నీని ఒకవేళ జరిపితే ఎక్కడ ఆడినా పర్వాలేదు. కాకపోతే టీవీ ప్రసార వేళలు చూసుకుంటే సరిపోతుంది" -బ్రిజేశ్ పటేల్, ఐపీఎల్ ఛైర్మన్

ఐపీఎల్ 2020 ట్రోఫీ

ఇవీ చదవండి:

Last Updated : Jul 2, 2020, 9:34 PM IST

ABOUT THE AUTHOR

...view details