భారత క్రికెట్ బోర్డు(బీసీసీఐ) తమ వార్షిక కాంట్రాక్ట్ నిబంధనలను సవరించింది. ఇకపై టీమ్ఇండియా తరఫున ఆడే టీ20 ఆటగాళ్లకు సెంట్రల్ కాంట్రాక్ట్ పొందవచ్చు. ఇందుకు ఆటగాడు కనీసం పది టీ20లు ఆడాల్సి ఉంటుంది. గతంలో వార్షిక ఒప్పందాలు కేవలం వన్డే, టెస్టు క్రికెటర్లకు మాత్రమే ఉండేవి.
ఇకపై టీ20 ఆటగాళ్లకూ బీసీసీఐ కాంట్రాక్ట్ - Committee of Administrators news
ఆటగాళ్లకు ప్రతి ఏటా ప్రకటించే కాంట్రాక్ట్లో టీ20లనూ బీసీసీఐ జతచేసింది. ఇప్పటివరకు వన్డేలు, టెస్టు క్రీడాకారులకు మాత్రమే వార్షిక వేతనం ఇచ్చేవారు. ఇకపై పొట్టి ఫార్మాట్ ఆటగాళ్లకు వేతనం అందనుంది.
![ఇకపై టీ20 ఆటగాళ్లకూ బీసీసీఐ కాంట్రాక్ట్ BCCI news](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9606105-880-9606105-1605872590629.jpg)
సుప్రీం నిర్ణయంతో..
సుప్రీంకోర్టు నియమించిన క్రికెట్ పాలకుల కమిటీ(సీఓఏ) గతంలోనే టీ20 ఫార్మాట్ను ఒప్పందాల్లో చేర్చాలని సూచించినా.. బోర్డు అందుకు ఒప్పుకోలేదు. అయితే ఇప్పుడు దాదా పాలకవర్గం ఈ నూతన మార్పునకు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ప్రస్తుతం నాలుగు కేటగిరీల్లో కాంట్రాక్ట్లు ఉంటున్నాయి. ఏ+ కేటగిరీలో ఉన్నవారికి ఏడాదికి రూ.7 కోట్లు, ఏ కేటగిరిలో ఉంటే రూ.5 కోట్లు, బి కేటగిరిలో రూ.3 కోట్లు, సీ కేటగిరీలో రూ.1 కోటి వార్షిక వేతనంగా బీసీసీఐ ఇస్తుంది. అయితే ఈ కాంట్రాక్ట్లో చోటు దక్కించుకోవాలంటే ఆటగాడు కనీసం 3 టెస్టులు లేదా 7 వన్డేలు ఆడాల్సి ఉండేది.