వెస్టిండీస్పై టీ20 సిరీస్ గెలిచి జోరుమీదున్న టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ. పేసర్ భువనేశ్వర్ కుమార్ గాయంతో ఇబ్బంది పడుతున్నట్లు సమాచారం. ఈ కారణంగా వన్డే సిరీస్కు దూరమైనట్లు తెలుస్తోంది. ఇతడి స్థానంలో శార్దుల్ ఠాకుర్కు చోటు లభించనుంది.
యాజమాన్యానికి ఫిర్యాదు..!
విండీస్తో నిర్ణయాత్మక మూడో టీ20 మ్యాచ్ తర్వాత తనకు ఇబ్బందిగా ఉందని బీసీసీఐ యాజమాన్యానికి ఫిర్యాదు చేశాడు భువీ. ఇటీవలే వెన్ను నొప్పి వల్ల మూడు నెలలు విశ్రాంతి తీసుకున్నాడు. కోలుకుని ఒక సిరీస్ ఆడాడో లేదో మళ్లీ గాయం తిరగబెట్టింది. మున్ముందు కీలక సిరీస్లు సహా టీ20 ప్రపంచకప్ ఉండటం వల్ల అతడిని కరీబియన్లపై ఆడించే సాహసం చేసే అవకాశం లేదని సమాచారం.