తెలంగాణ

telangana

ETV Bharat / sports

టీమిండియాకు జరిమానాల హ్యాట్రిక్.. ఈసారి భారీ కోత - Indian cricketers fined 80 per cent match fee

న్యూజిలాండ్​తో జరిగిన తొలి వన్డేలో స్లో ఓవర్ రేట్ కారణంగా టీమిండియాకు భారీ జరిమానా విధించింది ఐసీసీ. ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో భారీ కోత విధించింది.

టీమిండియా
టీమిండియా

By

Published : Feb 5, 2020, 7:09 PM IST

Updated : Feb 29, 2020, 7:27 AM IST

హామిల్టన్ వేదికగా న్యూజిలాండ్​​తో జరిగిన తొలి వన్డేలో ఓడిపోయింది టీమిండియా. ఈ మ్యాచ్ తర్వాత​ భారత్​కు మరోసారి షాక్ తగిలింది. ఇందులో స్లో ఓవర్​ రేట్ కారణంగా భారత్​కు భారీ జరిమానా విధించిందిఅంతర్జాతీయ క్రికెట్ మండలి. ఆటగాళ్ల ఫీజులో 80 శాతం కోత విధిస్తున్నట్లు ప్రకటించింది. ఈ కారణంతోనే నాలుగో టీ20లోనూ 40 శాతం, ఐదో టీ20లో 20 శాతం కోత ఎదుర్కొన్నారు భారత క్రికెటర్లు.

"భారత జట్టు నిర్దేశిత సమయంలో 50 ఓవర్లు వేయాల్సి ఉండగా నాలుగు ఓవర్లు ఆలస్యంగా వేసింది. అందుకే ఆటగాళ్ల మ్యాచ్​ ఫీజులో 80 శాతం కోత విధిస్తున్నాం. ఈ మ్యాచ్​కు సారథిగా ఉన్న విరాట్ కోహ్లీ తన పొరపాటును అంగీకరించడం వల్ల ఎలాంటి విచారణ ఉండదు"
-ఐసీసీ ప్రకటన

న్యూజిలాండ్​తో జరిగిన టీ20 సిరీస్​ను 5-0 తేడాతో వైట్​వాష్ చేసిన భారత్.. తొలి వన్డేలో ఓటమి చవిచూసింది. మొదట టీమిండియా 347 పరుగులు చేయగా 48.1 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది కివీస్.

Last Updated : Feb 29, 2020, 7:27 AM IST

ABOUT THE AUTHOR

...view details