తెలంగాణ

telangana

ETV Bharat / sports

టాస్ గెలిచిన భారత్.. విండీస్ బ్యాటింగ్

కటక్ వేదికగా విండీస్​తో జరుగుతున్న మూడో వన్డేలో టీమిండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ పిచ్ బ్యాటింగ్​కు అనుకూలించే అవకాశముంది.

By

Published : Dec 22, 2019, 1:03 PM IST

TOSS
భారత్- వెస్టిండీస్

వెస్టిండీస్​తో జరుగుతున్న నిర్ణయాత్మక మూడో వన్డేలో భారత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. కటక్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్​లో నెగ్గి సిరీస్ కైవసం చేసుకోవాలని భావిస్తున్నాయి ఇరు జట్లు. 1-1 తేడాతో సిరీస్ సమంగా ఉంది.

కటక్ బారబతి పిచ్ బ్యాటింగ్​కు అనుకూలించే అవకాశముంది. గత 15 ఏళ్ల కాలంలో ఈ మైదానంలో భారత్ ఆరు వన్డేలాడగా ఒక్క మ్యాచ్​లోనూ ఓడలేదు.

అయితే ఈ పిచ్​పై విరాట్ కోహ్లీకి పేలవ రికార్డు ఉంది. ఇక్కడ జరిగిన నాలుగు అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో కలిపి అతను కేవలం 34 పరుగులే చేశాడు. మూడు వన్డేల్లో వరుసగా 3, 22, 1 పరుగులు చేసిన విరాట్‌.. ఏకైక టీ20లో 8 పరుగులకే పరిమితమయ్యాడు.

జట్లు..

భారత జట్టు:

రోహిత్​ శర్మ, కేఎల్​ రాహుల్​, విరాట్​ కోహ్లీ(కెప్టెన్​), శ్రేయస్​ అయ్యర్​, రిషభ్ పంత్​(కీపర్​), కేదార్​ జాదవ్​, రవీంద్ర జడేజా, మహ్మద్​ షమీ, శార్దుల్​ ఠాకుర్​, నవదీప్​ సైనీ.

వెస్టిండీస్​ జట్టు:

షై​ హోప్​(కీపర్​), ఎవిన్​ లూయిస్​, షిమ్రన్​ హెట్​మెయిర్​, నికోలస్​ పూరన్​, రోస్టన్​ ఛేజ్​, కీరన్​ పొలార్డ్​(కెప్టెన్​), జేసన్​ హోల్డర్​, కీమో పాల్​, అల్జారీ జోసెఫ్​, షెల్డన్​ కాట్రెల్​,కేరీ పియరే.

ఇదీ చదవండి: ఫిఫా క్లబ్ ప్రపంచకప్​ విజేతగా లివర్​పుల్​

ABOUT THE AUTHOR

...view details