తెలంగాణ

telangana

ETV Bharat / sports

భారత్​Xదక్షిణాఫ్రికా: నేటి నుంచే మహిళల టీ20 పోరు

దక్షిణాఫ్రికాతో టీ20 ఫార్మాట్​లో తలపడేందుకు  భారత మహిళా జట్టు సిద్ధమైంది. 5 మ్యాచ్​ల సిరీస్​లో భాగంగా సూరత్​లో తొలి టీ20​ ఈ రోజు సాయంత్రం 7 గంటలకు ప్రారంభం కానుంది.

By

Published : Sep 24, 2019, 8:31 AM IST

Updated : Oct 1, 2019, 7:11 PM IST

భారత్​Xదక్షిణాఫ్రికా: నేటి నుంచే మహిళల టీ20 పోరు

దక్షిణాఫ్రికాతో భారత మహిళల జట్టు టీ20 పోరాటం నేటి నుంచి ప్రారంభంకానుంది. అయిదు టీ20 సిరీస్‌లో భాగంగా నేడు సూరత్​ వేదికగా తొలి మ్యాచ్​ ఆడనుంది. ఇటీవల మిథాలీ రాజ్​ పొట్టి ఫార్మాట్​కు వీడ్కోలు పలకడం వల్ల సారథ్య బాధ్యతలు చేపట్టింది హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌.

ఇటీవల సఫారీ జట్టుతో వాళ్ల సొంతగడ్డపై తలపడిన మహిళా టీమిండియా... 5 టీ20ల్లో మూడింటిని గెలిచింది. ఇదే జోష్​ కొనసాగించి స్వదేశంలో జరిగే సిరీస్‌లోనూ ఆ జట్టును ఓడించాలనే పట్టుదలతో ఉంది.

బ్యాటింగ్‌లో కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌తో పాటు స్మృతి మంధాన, జెమిమా రోడ్రిగ్స్‌ రాణించడం కీలకం. బౌలింగ్‌లో శిఖా పాండే, దీప్తి శర్మ, అనుజ పాటిల్‌పై టీమిండియా ఆధారపడుతోంది.

హర్మన్​ప్రీత్​ కౌర్​, స్మృతి మంధాన

వార్మప్​ జోరు...

ఆదివారం జరిగిన వార్మప్‌ మ్యాచ్‌లో భారత బోర్డు ప్రెసిడెంట్స్‌ ఎలెవన్‌ జట్టును 83 పరుగుల తేడాతో ఓడించింది దక్షిణాఫ్రికా. ఇదే ఊపుతో తొలి టీ20లో నెగ్గి బోణీ కొట్టాలని తహతహలాడుతోంది. వార్మప్‌ మ్యాచ్‌లో రాణించిన లీజెల్‌ లీపైనే సఫారీ బృందం ఆశలు పెట్టుకుంది.

తొలి 3 టీ20లకు భారత జట్టు...

హర్మన్​ ప్రీత్​ కౌర్​(సారథి), స్మృతి మంధాన, జెమిమా రోడ్రిగ్స్‌, దీప్తి శర్మ, తనియ భాటియా(కీపర్​), పూనమ్​ యాదవ్​, శిఖా పాండే, అరుంధతి రెడ్డి, పూజ, రాధా యాదవ్​, వేదా కృష్ణమూర్తి, హర్లీన్​ డియోల్​, అనూజ పాటిల్​, షఫాలీ వర్మ, మాన్షీ జోషి

Last Updated : Oct 1, 2019, 7:11 PM IST

ABOUT THE AUTHOR

...view details