తెలంగాణ

telangana

ETV Bharat / sports

భారత బౌలర్ల ధాటికి విండీస్ కుదేల్.. సిరీస్ కైవసం

వెస్టిండీస్ మహిళల జట్టుతో జరిగిన మూడో టీ20లో భారత్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. రాధా యాదవ్, దీప్తి శర్మ చెరో రెండు వికెట్లు తీశారు. టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించారు. 5 టీ20ల సిరీస్​ను 3-0 తేడాతో కైవసం చేసుకుంది భారత్.

By

Published : Nov 15, 2019, 12:53 PM IST

భారత బౌలర్లు ధాటికి విండీస్ కుదేల్.. సిరీస్ కైవసం

వెస్టిండీస్ మహిళలతో జరిగిన తొలి రెండు టీ20ల్లో బ్యాటింగ్​తో అదరగొట్టిన భారత అమ్మాయిలు.. శుక్రవారం జరిగిన మూడో టీ20లో బౌలింగ్​తో సత్తాచాటారు. గయానా వేదికగా జరిగిన ఈ మ్యాచ్​లో మొదట బ్యాటింగ్​ చేసింది విండీస్. భారత బౌలర్ల ధాటికి నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయి 59 పరుగులే చేసింది. రాధా యాదవ్, దీప్తి శర్మ చెరో రెండు వికెట్లు తీసి కరీబియన్ జట్టు పతనాన్ని శాసించారు.

రోడ్రిగ్స్​కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్​..

అనంతరం బరిలోకి దిగిన టీమిండియా.. 3 వికెట్లు కోల్పోయి మూడు ఓవర్లు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించింది. 40 పరుగులతో ఆకట్టుకున్న టీమిండియా బ్యాట్స్​ఉమన్ జెర్మియా రోడ్రిగ్స్​కు ప్లేయర్ ఆఫ్​ ద మ్యాచ్ అవార్డు దక్కింది.

రోడ్రిగ్స్​

గత రెండు మ్యాచ్​ల్లో అర్ధశతకాలతో రెచ్చిపోయిన షెఫాలీ వర్మ డకౌట్​గా వెనుదిరగ్గా.. స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన 3 పరుగులే చేసింది.

బౌలర్ల విధ్వంసం..

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న వెస్టిండీస్ అమ్మాయిలు ఆరంభం నుంచి నిదానంగా ఆడారు. భారత బౌలర్లు ప్రత్యర్థిని ఎప్పటికప్పుడు ఇబ్బంది పెడుతూ పొదుపుగా బౌలింగ్ చేశారు. ఫలితంగా తొలి పది ఓవర్లలో విండీస్ 3 వికెట్లు నష్టపోయి 26 పరుగులే చేయగలిగింది.

అనంతరం గేరు మార్చిన టీమిండియా అమ్మాయిలు వికెట్ల వేటలో పడ్డారు. దాదాపు ఓవర్​కొకరు చొప్పున తర్వాతి పది ఓవర్లలో 6 వికెట్లు తీశారు.

విండీస్ బ్యాట్స్​ఉమన్​లో చేడీన్ నేషన్(11), హెన్రీలదే(11) అత్యుత్తమ స్కోరు. మిగతా వారు సింగిల్ డిజిట్​కే పరిమతమయ్యారు.

ఎడం చేతి వాటం బౌలరైన రాధా యాదవ్ 4 ఓవర్లలో 6 పరుగులిచ్చి రెండు కీలక వికెట్లు తీసింది. ఇందులో రెండు మెయిడెన్లు ఉండటం విశేషం. మరో పేసర్ దీప్తి శర్మ 4 ఓవర్లలో 12 పరుగులిచ్చి 2 వికెట్లతో ఆకట్టుకుంది. మిగతా బౌలర్లు తలో వికెట్ ఖాతాలో వేసుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details