తెలంగాణ

telangana

By

Published : Jan 2, 2020, 5:30 AM IST

ETV Bharat / sports

భారత్​తో టీ20 సిరీస్​కు లంక జట్టిదే..

2020ని టీ20 సిరీస్​తో ప్రారంభించనుంది టీమిండియా. ఈ ఏడాది పొట్టి ప్రపంచకప్​ అందుకోవాలని ఆశిస్తున్న కోహ్లీ సేన.. జనవరి 5 నుంచి సొంత గడ్డపై జరగనున్న సిరీస్​కు సన్నద్ధమవుతోంది. తాజాగా లంక బోర్డు జట్టును ప్రకటించింది. ఈ సందర్భంగా ఇరుజట్లు వివరాలు ఇవిగో.

India vs Sri Lanka 2020: Sri Lanka Announced Squad with For T20 Series in India
2020లో కోహ్లీసేన తలపడే తొలి టీ20 సిరీస్​కు లంక జట్టిదే..

నూతన సంవత్సరంలో భారత్​తో అమీతుమీ తేల్చుకోడానికి సిద్ధమౌతోంది శ్రీలంక. ఈ నెల 5 నుంచి ప్రారంభంకానున్న మూడు టీ20ల సిరీస్‌ కోసం 16 మందితో జట్టుని ప్రకటించింది. ఫాస్ట్ బౌలర్ లసిత్ మలింగ సారథి. దాదాపు 16 నెలల తర్వాత టీ20 జట్టులోకి ఆల్‌రౌండర్ ఏంజిలో మాథ్యూస్ వస్తున్నాడు. అయితే ఇప్పటికే భారత్​ కూడా తన జట్టుని ప్రకటించింది. ఇందులో స్పీడ్​స్టర్​ జస్ప్రీత్​ బుమ్రా, సీనియర్​ బ్యాట్స్​మన్​ శిఖర్​ ధావన్​ చోటు సంపాదించుకున్నారు.

గత ఏడాది చివర్లో వెస్టిండీస్​పై 2-1 తేడాతో భారత్​ టీ20 సిరీస్​ గెలవగా... పాకిస్థాన్ గడ్డపై శ్రీలంక జట్టు మూడు టీ20ల సిరీస్‌ను 3-0తో చేజిక్కించుకుంది. ఫలితంగా ఇరుజట్లు అదే జోరుని ప్రదర్శించాలని ఊవిళ్లూరుతున్నాయి.

మాథ్యూస్​ వచ్చేశాడు...

భారత్ పిచ్‌లపై శ్రీలంక కెప్టెన్​ లసిత్ మలింగకు మంచి అవగాహన ఉండగా.. మెండిస్, ఇసురు ఉడానా వంటి సీనియర్లతో లంక జట్టు పటిష్ఠంగా ఉంది. వీరికి తోడు ఆల్​రౌండర్​ ఏంజిలో మాథ్యాస్​ కూడా రావడం వల్ల జట్టుకు మరితం బలం చేకూరింది.

  • శ్రీలంక జట్టు:

లసిత్‌ మలింగ (కెప్టెన్​), దనుష్క గుణతిలక, అవిష్క ఫెర్నాండో, ఏంజెలో మాథ్యూస్‌, దసున్‌ శనక, కుశాల్‌ పెరీరా, నిరోషన్‌ డిక్వెలా, ధనంజయ డి సిల్వా, ఇసురు ఉదాన, భానుక రాజపక్స, ఒషాద ఫెర్నాండో, వనిందు హసరంగ, లాహిరు కుమార, కుశాల్‌ మెండిస్‌, లక్షణ్‌ సందకన్‌, కసున్‌ రజిత.

బుమ్రా రీఎంట్రీ...

వెన్నుగాయం కారణంగా స్వదేశంలో జరిగిన పలు సిరీస్​లకు దూరంగా ఉన్నాడు టీమిండియా స్టార్​ పేసర్ బుమ్రా. ప్రస్తుతం కోలుకొని ప్రాక్టీస్​లో పాల్గొంటున్నాడు. శ్రీలంక సిరీస్​లో ఇతడికి చోటు కల్పించారు సెలక్టర్లు. టీమిండియా స్టార్​ ఓపెనర్​ శిఖర్​ ధావన్​ జట్టులోకి రాగా... రోహిత్​ శర్మకు విశ్రాంతినిచ్చారు.

  • భారత జట్టు:

విరాట్ కోహ్లీ (కెప్టెన్), శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), మనీశ్ పాండే, సంజు శాంసన్, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, చాహల్, కుల్దీప్ యాదవ్, శార్దుల్ ఠాకూర్, నవదీప్ సైనీ, జస్ప్రీత్​ బుమ్రా.

వేదికలు ఇవే...

తొలి టీ20 మ్యాచ్‌ జనవరి 5న గౌహతి వేదికగా జరగనుంది. రెండో టీ20 జనవరి 7న ఇండోర్ వేదికగా, ఆఖరి టీ20 మ్యాచ్ పుణె వేదికగా జనవరి 10న నిర్వహించనున్నారు. అన్ని మ్యాచ్‌లు భారత కాలమాన ప్రకారం రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతాయి.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details