భారత పర్యటనలో భాగంగా వన్డే, టీ20 సిరీస్ కోసం 17 మందితో మహిళల క్రికెట్ జట్టును ప్రకటించింది దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు. గతంలో ఆ టీమ్కు కెప్టెన్గా వ్యవహరించిన డేన్ వాన్ నీకెర్క్ గాయం కారణంగా సిరీస్కు దూరమైంది. ఈ నేపథ్యంలో సునే లూస్కు జట్టు పగ్గాలు అందించారు.
మార్చి 7 నుంచి ప్రారంభంకానున్న సిరీస్లో భాగంగా దక్షిణాఫ్రికా, భారత మహిళా జట్లు ఐదు వన్డేలు, మూడు టీ20లు ఆడనున్నాయి.
దక్షిణాఫ్రికా జట్టు:
సునే లూస్ (కెప్టెన్), అయాబోంగా ఖాకా, షాబ్నిమ్ ఇస్మాయిల్, లారా వోల్వార్డ్ట్, త్రిషా చెట్టి (వికెట్ కీపర్), సినాలో జాఫ్తా (వికెట్ కీపర్), తాస్మిన్ బ్రిట్జ్ (వికెట్ కీపర్), మారిజాన్ కాప్, నోండుమిసో, లిజాల్లే లీ (వికెట్ కీపర్), అన్నే బాష్, ఫయే టన్నిక్లైఫ్ (వికెట్ కీపర్), నాన్కులూకో మ్లాబా, మిగ్నాన్ డు ప్రీజ్ (వికెట్ కీపర్), నాడిన్ డి క్లర్క్, లారా గూడాల్, తుమి సేఖుఖునే.
ఇదీ చూడండి:సౌతాఫ్రికాతో వన్డే, టీ20లకు భారత మహిళా జట్లు ఇవే