తెలంగాణ

telangana

By

Published : Sep 22, 2019, 8:50 PM IST

Updated : Oct 1, 2019, 3:20 PM IST

ETV Bharat / sports

భారత బ్యాట్స్​మెన్​ విఫలం​... సఫారీల లక్ష్యం 135

చిన్నస్వామి స్టేడియం వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన చివరి టీ20లో భారత బ్యాట్స్​మెన్​ తేలిపోయారు. సఫారీల బౌలింగ్​ ఎదుర్కోలేక తక్కువ పరుగులకే ఔటైంది కోహ్లీసేన. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 134 స్కోరు మాత్రమే సాధించింది.

భారత బ్యాట్స్​మెన్​ విఫలం​... సఫారీ జట్టు లక్ష్యం 140

దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 పోరులో భారత్‌ బ్యాట్స్​మెన్​ నిరాశపర్చారు. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా నేడు చిన్నస్వామి వేదికగా జరిగిన ఆఖరి టీ20లో... నిర్ణీత 20 ఓవర్లకు 9 వికెట్లు కోల్పోయి 134 పరుగులు చేసింది టీమిండియా.

ఆరంభమే నిరాశ...

టాస్​ గెలిచి బ్యాటింగ్​ ఎంచుకున్న కోహ్లీసేనకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్​ రోహిత్​శర్మ(9) సిరీస్​లో మరోసారి పేలవ ప్రదర్శన చేశాడు. మరో ఓపెనర్​ శిఖర్​ ధావన్​ 36 పరుగులతో(25 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లు) మరోసారి రాణించాడు. హిట్​మ్యాన్​ ఔట్​ తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్​ కోహ్లీ 9 పరుగులకే ఔటయ్యాడు.

ఈ టోర్నీలో ప్రదర్శన కారణంగా నిరాశ ఎదుర్కొంటున్న రిషబ్​ పంత్​ 19 పరుగులు(20 బంతుల్లో 1ఫోర్​, 1 సిక్సర్​) మెరుగయ్యాడు. మిగతా బ్యాట్స్​మెన్​ శ్రేయస్​ అయ్యర్​(5), కృనాల్​ పాండ్య(5) దారుణంగా విఫలమయ్యారు.

ఆల్​రౌండర్లు హార్దిక్​ పాండ్య 14 పరుగులు(18 బంతుల్లో 1 ఫోర్​), రవీంద్ర జడేజా 19 రన్స్​(17 బంతుల్లో 1 ఫోర్​, 1సిక్సర్) ఫర్వాలేదనిపించారు. వీరిద్దరి వల్లే స్కోరు ఆ మాత్రమైనా వచ్చింది. ఆఖర్లో టపటపా వికెట్లు కోల్పోయింది టీమిండియా. వాషింగ్టన్​ సుందర్​(4) తక్కువకే ఆటయ్యాడు. బౌలర్లు దీపక్​ చాహర్​(0), సైనీ(0) క్రీజులో నిలిచి ఆలౌట్​ కాకుండా చూసుకున్నారు.

సఫారీ జట్టు బౌలర్లలో రబాడా 3 వికెట్లు, ఫార్చ్యూన్​, హెండ్రిక్స్​ చెరో 2 వికెట్లు తీసుకున్నారు. షంశీ ఒక వికెట్​ ఖాతాలో వేసుకున్నాడు.

మూడు మ్యాచ్​ల సిరీస్​లో 1-0తో ఆధిక్యంలో ఉంది టీమిండియా. తొలి టీ20 వర్షం కారణంగా రద్దవ్వగా... రెండో మ్యాచ్‌లో భారత జట్టు 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

Last Updated : Oct 1, 2019, 3:20 PM IST

ABOUT THE AUTHOR

...view details