న్యూజిలాండ్తో జరుగుతున్న చివరి టీ20లో టాస్ గెలిచిన భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఇప్పటికే 4-0తో సిరీస్లో ఆధిక్యంలో ఉన్న టీమిండియా.. ఇందులోనూ గెలిచి ప్రత్యర్థిని వైట్వాష్ చేయాలని చూస్తోంది. అదే సమయంలో.. గెలిచి, పరువు నిలుపుకోవాలని కివీస్ చూస్తోంది.
న్యూజిలాండ్ గడ్డపై భారత్ ఇప్పటివరకు టీ20 సిరీస్ గెలవలేదు. 2009లో ధోనీ సారథ్యంలోని జట్టు 0-2తో ఓటమి పాలైంది. గతేడాది మూడు మ్యాచ్ల సిరీస్ 1-2తో చేజారింది. అయితే తాజా సిరీస్లో నాలుగు విజయాలు సాధించిన కోహ్లీ సేన.. ఇప్పటికే కివీస్ గడ్డపై ట్రోఫీ ఖాయం చేసుకుంది. అయితే ఐదు మ్యాచ్లు గెలిస్తే.. 'మెన్ ఇన్ బ్లూ' టీ20 ర్యాంకింగ్స్లో మరింత ముందుకెళ్తుంది. ఎప్పటినుంచో ఐదో స్థానానికే పరిమితమైన భారత్.. మెరుగైన ప్రదర్శన చేస్తే ఒక ర్యాంకు మెరుగుపడి నాలుగోస్థానానికి ఎగబాకొచ్చు.
జట్లు