ఆక్లాండ్లో జరుగుతున్న రెండో టీ20లో న్యూజిలాండ్ను తక్కువ పరుగులకే కట్టడి చేసింది భారత్. తొలి ఇన్నింగ్స్లో కివీస్.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 132 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఓపెనర్లు గప్తిల్ 33, మన్రో 26 పరుగులు చేశారు. మిగతా వారిలో విలియమన్స్ 14, గ్రాండ్హోమ్ 3, టేలర్ 18, సైఫర్ట్ 32 పరుగులు చేశారు.
తడబడిన న్యూజిలాండ్.. భారత్ లక్ష్యం 133 - kohli
రెండో టీ20లో కోహ్లీసేనకు 133 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది న్యూజిలాండ్. ఆక్లాండ్ వేదికగా ఈ మ్యాచ్ జరుగుతోంది.

భారత్-న్యూజిలాండ్ టీ20
టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న న్యూజిలాండ్ను ప్రారంభం నుంచే భారత్ బౌలర్లు కట్టడి చేశారు. చక్కని లైన్ అండ్ లెంగ్త్తో బంతులేస్తూ పరుగులు చేయకుండా అడ్డుకున్నారు. వీరిలో జడేజా 2 వికెట్లు తీయగా, శివమ్ దూబే, శార్దుల్, బుమ్రా తలో వికెట్ పడగొట్టారు.
Last Updated : Feb 25, 2020, 4:23 PM IST