తెలంగాణ

telangana

కోహ్లీ 27వ సెంచరీ.. భారీ ఆధిక్యం దిశగా భారత్

By

Published : Nov 23, 2019, 2:38 PM IST

Updated : Nov 23, 2019, 3:06 PM IST

గులాబి బంతితో జరుగుతున్న టెస్టులో భారత బ్యాట్స్​మెన్ ధాటిగా ఆడుతున్నారు. సారథి కోహ్లీ.. టెస్టుల్లో 27వ సెంచరీ చేశాడు.

కెప్టెన్ కోహ్లీ

ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతోన్న డే/నైట్ టెస్టులో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ తన టెస్టు కెరీర్​లో 27వ సెంచరీ చేశాడు. పింక్ బంతితో తొలి శతకం చేసిన భారత బ్యాట్స్​మన్, కెప్టెన్​గా నిలిచాడు. రెండో రోజు లంచ్​ విరామానికి 4 వికెట్లు నష్టానికి 289 పరుగులు చేసింది టీమిండియా. ప్రస్తుతం క్రీజులో కోహ్లీ(130), రవీంద్ర జడేజా(12) ఉన్నారు.

రెండో రోజు 174/3తో ప్రాంరంభించిన కోహ్లీ సేన.. దూకుడుగా ఆటను ప్రారంభించింది. ఈ క్రమంలోనే అర్ధ సెంచరీ చేసిన రహానే(51).. స్లిప్​లో క్యాట్​ ఔట్​గా వెనుదిరిగాడు.

Last Updated : Nov 23, 2019, 3:06 PM IST

ABOUT THE AUTHOR

...view details