తెలంగాణ

telangana

By

Published : Nov 7, 2019, 7:42 PM IST

ETV Bharat / sports

పొట్టి ఫార్మాట్​లో రోహిత్ శర్మ 'సెంచరీ'

బంగ్లాదేశ్​తో జరుగుతోన్న రెండో టీ20లో పాల్గొన్న రోహిత్ శర్మ..  ఈ ఫార్మాట్​లో వంద మ్యాచ్​లు ఆడిన రెండో క్రికెటర్​గా రికార్డు సృష్టించాడు.

రోహిత్ శర్మ

బంగ్లాదేశ్​తో రెండో టీ20 ఆడుతోన్న భారత క్రికెటర్ రోహిత్ శర్మ అరుదైన ఘనత సాధించాడు. ఈ ఫార్మాట్​లో వంద మ్యాచ్​లు ఆడిన రెండో ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. పాకిస్థాన్ ఆల్​రౌండర్ షోయబ్ మాలిక్ మొదటి స్థానంలో ఉన్నాడు.

వంద టీ20లు ఆడిన టాప్-5 ఆటగాళ్లు

  • షోయబ్ మాలిక్(పాకిస్థాన్)-111
  • రోహిత్ శర్మ(భారత్) -100
  • షాహిద్ అఫ్రిదీ(పాకిస్థాన్​)-99
  • ఎమ్​.ఎస్​ ధోనీ(భారత్)-98
  • రాస్ టేలర్(కివీస్)-93

టీమిండియా మహిళా క్రికెటర్ హర్మన్ ప్రీత్ కౌర్.. ఇంతకు ముందే 100 టీ20లు ఆడేసింది. ఈ ఘనతను ఇప్పటివరకు పది మంది మహిళా క్రికెటర్లు సాధించారు.

వంద టీ20లు ఆడిన టాప్-5 మహిళా క్రికెటర్లు

  • సూజీ బేట్స్(న్యూజిలాండ్)-111
  • ఎలైస్ పెర్రీ(ఆస్ట్రేలియా)-111
  • దియేంద్రా డొటిన్(వెస్టిండీస్)-110
  • సనా మిర్(పాకిస్థాన్​)-106
  • జెన్నీ గన్​(ఇంగ్లాండ్)-104

బంగ్లాదేశ్​తో రెండో టీ20లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది భారత్. రాజ్​కోట్ వేదికగా మ్యాచ్​ జరుగుతోంది. గెలిచి తీరాలనే కసితో ఉంది టీమిండియా. మూడు మ్యాచ్​ల సిరీస్​లో 1-0 తేడాతో ముందున్న బంగ్లా.. ఇందులోనూ గెలిచి సిరీస్​ కైవసం చేసుకోవాలని చూస్తోంది.

ఇదీ చదవండి: టాస్ గెలిచిన భారత్... బంగ్లా బ్యాటింగ్

ABOUT THE AUTHOR

...view details