కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఈ నెల 22 నుంచి 26 వరకు భారత్-బంగ్లాదేశ్ మధ్య చారిత్రక డే/నైట్ టెస్టు జరగనుంది. తొలిసారి ఇరుజట్లు ఈ పద్ధతిలో మ్యాచ్ను ఆడనున్నాయి. అయితే ఈ మ్యాచ్ను మధ్యాహ్నం 1 గంట నుంచి రాత్రి 8 గంటల వరకు నిర్వహించనుంది బీసీసీఐ. రాత్రి 8 గంటల తర్వాత మంచు ప్రభావం ఎక్కువగా ఉండనున్న నేపథ్యంలో ముందుగానే మ్యాచ్ను ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు.
"బంగాల్ క్రికెట్ అసోషియేషన్ (క్యాబ్) అభ్యర్థన మేరకు ఆట నిర్వహణ సమయంలో మార్పులు చేస్తున్నాం. మ్యాచ్ను మధ్యాహ్నం 1 గంటకు ప్రారంభిస్తాం. తొలి సెషన్ మధ్యాహ్నం మూడు గంటలకు ముగుస్తుంది. 3:40కి ప్రారంభమయ్యే రెండో సెషన్ సాయంత్రం 5:40వరకు కొనసాగుతుంది. ఆఖరి సెషన్ సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు జరుగుతుంది. ఫలితంగా మ్యాచ్పై మంచు తీవ్రత అంతగా ఉండదు."