తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఆసీస్​తో టెస్టు సిరీస్​ నుంచి ఉమేశ్ ఔట్! - ఉమేస్​ యాదవ్​కు గాయం

ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టులో గాయపడిన టీమ్ఇండియా పేసర్ ఉమేశ్​ యాదవ్.. బుధవారం రాత్రి స్వదేశానికి బయలుదేరాడని సమాచారం. గాయం నుంచి కోలుకోవడానికి ఇంకా సమయం పట్టే అవకాశం ఉన్నందున అతడు ఆసీస్​తో జరుగుతోన్న టెస్టు సిరీస్​కు దూరమయ్యాడు.

umesh
ఉమేశ్​

By

Published : Dec 31, 2020, 1:25 PM IST

టీమ్​ఇండియా పేసర్​ ఉమేశ్​ యాదవ్​ ఆసీస్​తో జరిగే మూడు, నాలుగు టెస్టులకు అందుబాటులో ఉండట్లేదు. రెండో టెస్టు, మూడో రోజు ఆటలో గాయం కావడమే ఇందుకు కారణం. బెంగళూరు ఎన్​సీఏ శిక్షణ శిబిరంలో చికిత్స తీసుకునేందుకు బుధవారం రాత్రి అతడు స్వదేశానికి తిరిగి బయలుదేరాడని తెలిసింది. ఫిబ్రవరిలో ఇంగ్లాండ్​తో జరగబోయే సిరీస్​ వరకు అతడు కోలుకుంటాడని సమాచారం.

ఇప్పటికే గాయాల కారణంగా మహ్మద్​ షమీ, ఇషాంత్​ శర్మ సేవలను కోల్పోయింది టీమ్ఇండియా. దీంతో ప్రస్తుతం బుమ్రా, సిరాజ్​లతో బంతిని పంచుకునే పేసర్​పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

శార్దూల్​కే ఓటు..

ఉమేశ్​ గాయంతో ఆసీస్ సిరీస్​ నుంచి వైదొలగగా అతడి స్థానంలో మూడో టెస్టు కోసం శార్దూల్ ఠాకూర్​ను తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. నటరాజన్​ను తీసుకుంటారని వార్తలు వచ్చినా మేనేజ్​మెంట్ శార్దూల్​ వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.

ఇదీ చూడండి : మూడో టెస్టుకు ఉమేశ్​ స్థానంలో నటరాజన్!

ABOUT THE AUTHOR

...view details