టీమ్ఇండియా పేసర్ ఉమేశ్ యాదవ్ ఆసీస్తో జరిగే మూడు, నాలుగు టెస్టులకు అందుబాటులో ఉండట్లేదు. రెండో టెస్టు, మూడో రోజు ఆటలో గాయం కావడమే ఇందుకు కారణం. బెంగళూరు ఎన్సీఏ శిక్షణ శిబిరంలో చికిత్స తీసుకునేందుకు బుధవారం రాత్రి అతడు స్వదేశానికి తిరిగి బయలుదేరాడని తెలిసింది. ఫిబ్రవరిలో ఇంగ్లాండ్తో జరగబోయే సిరీస్ వరకు అతడు కోలుకుంటాడని సమాచారం.
ఇప్పటికే గాయాల కారణంగా మహ్మద్ షమీ, ఇషాంత్ శర్మ సేవలను కోల్పోయింది టీమ్ఇండియా. దీంతో ప్రస్తుతం బుమ్రా, సిరాజ్లతో బంతిని పంచుకునే పేసర్పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.