బాక్సింగ్ డే టెస్టుతో టెస్టు అరంగేట్రం చేసిన భారత ఆటగాడు శుభ్మన్ గిల్ అదరగొట్టాడు. మెల్బోర్న్లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఈ మ్యాచ్లో 45 పరుగులు చేసి కొద్దిలో అర్ధ శతకం చేజార్చుకున్నాడు. ఈ క్రమంలోనే ఓ ఘనత సాధించాడు.
ఆసీస్ జట్టుపై టెస్టు అరంగేట్రంలోనే ఎక్కువ పరుగులు చేసిన మూడో భారత బ్యాట్స్మన్గా నిలిచాడు. ఇతడి కంటే ముందు మయాంక్ అగర్వాల్ (2018లో 76 పరుగులు), మాజీ క్రికెటర్ దత్తు ఫడ్కర్ (51) ఉన్నారు.