తెలంగాణ

telangana

ETV Bharat / sports

స్మిత్ సెంచరీ ధమాకా.. భారత్ లక్ష్యం 287

నిర్ణయాత్మక మూడో వన్డేలో భారత్​కు 287 పరుగుల లక్ష్యాన్నిచ్చింది ఆస్ట్రేలియా. కంగారూ బ్యాట్స్​మన్ స్మిత్(131).. శతకంతో ఆకట్టుకున్నాడు.

By

Published : Jan 19, 2020, 5:16 PM IST

భారత్-ఆస్ట్రేలియా వన్డే
ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు

టీమిండియాతో మూడో వన్డేలో మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 286 పరుగులు చేసింది. స్టీవ్ స్మిత్ సెంచరీతో ఆకట్టుకోగా, యువ బ్యాట్స్​మన్ లబుషేన్ తన కెరీర్​లో తొలి అర్ధ శతకం చేశాడు. భారత బౌలర్లలో షమి 4, జడేజా 2 వికెట్లు తీయగా, కుల్​దీప్, సైనీ తలో వికెట్ పడగొట్టారు.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది ఆసీస్. ఓపెనర్లు వార్నర్ 3, ఫించ్ 19.. తక్కువ పరుగులే చేసి వెనుదిరిగారు. అలాంటి సమయంలో స్మిత్-లబుషేన్ నిలబడ్డారు. మూడో వికెట్​కు 126 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ క్రమంలో 54 పరుగులు చేసిన లబుషేన్.. జడేజా బౌలింగ్​లో కోహ్లీకి క్యాచ్​ ఇచ్చి ఔటయ్యాడు. మిగతా బ్యాట్స్​మెన్​లో స్టార్క్ 0, క్యారీ 35, టర్నర్ 4, కమిన్స్ 0, జంపా 1, అగర్ 9 పరుగులు చేశారు.

వికెట్ తీసిన ఆనందంలో భారత క్రికెటర్లు

ఒక్కడై నిలబడిన స్మిత్

ఈ మ్యాచ్​లో ఒక్కడై నిలబడిన స్మిత్.. తన వన్డే కెరీర్​లో తొమ్మిదో సెంచరీ(131) చేశాడు. భారత్​పైనా మూడోది. అదే విధంగా ఆసీస్​ తరఫున, ఈ ఫార్మాట్​లో అత్యంత వేగంగా 4000 పరుగులు చేసిన వారిలో నాలుగో స్థానంలో నిలిచాడు. 106 ఇన్నింగ్స్​ల్లో ఈ ఘనత సాధించాడు. 93 ఇన్నింగ్స్​లో ఈ మార్క్ చేరుకున్న వార్నర్.. జాబితాలో తొలి స్థానంలో ఉన్నాడు.

ABOUT THE AUTHOR

...view details