తెలంగాణ

telangana

ETV Bharat / sports

అండర్​-19 ప్రపంచకప్​: ఆసీస్​కు షాక్​.. సెమీస్​లో భారత్​ - అండర్​-19 ప్రపంచకప్​:ఆస్ట్రేలియాకు షాక్​.. సెమీస్​లో భారత్​

ఐసీసీ అండర్​-19 ప్రపంచకప్​లో యువ భారత్​ సెమీస్​కు దూసుకెళ్లింది. ఇవాళ జరిగిన క్వార్టర్​ ఫైనల్లో ఆస్ట్రేలియాపై 74 పరుగుల తేడాతో గెలిచింది. ఈ టోర్నీలో ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్​లూ గెలిచి అజేయ జట్టుగా కొనసాగుతోంది.

India U19 vs Australia U19, Super League Quarter-Final winner India and enters into semis
అండర్​-19 ప్రపంచకప్​:ఆస్ట్రేలియాకు షాక్​.. సెమీస్​లో భారత్​

By

Published : Jan 28, 2020, 9:08 PM IST

Updated : Feb 28, 2020, 8:01 AM IST

ఐసీసీ అండర్‌-19 ప్రపంచకప్‌ క్వార్టర్‌ ఫైనల్లో భారత్‌ అదరగొట్టింది. బలమైన ప్రత్యర్థి ఆస్ట్రేలియాపై అన్ని రంగాల్లోనూ ఆధిపత్యం ప్రదర్శించింది. 234 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక 43.3 ఓవర్లలో 159 రన్స్​కు ఆలౌట్​ అయింది కంగారూ జట్టు. నాలుగు వికెట్లతో ఆసీస్​ పతనాన్ని శాసించిన కార్తీక్​ త్యాగి మ్యాన్​ ఆఫ్​ ది మ్యాచ్​ అందుకున్నాడు.

ఫానింగ్​ కాస్త భయపెట్టాడు..

మోస్తరు లక్ష్య ఛేదనలో ఆరంభ ఓవర్లోనే టపటపా వికెట్లు కోల్పోయింది ఆసీస్​. పేసర్​ కార్తీక్​ త్యాగి దెబ్బకు 17 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ నలుగురూ వరుసగా 0, 4, 0, 2 స్కోర్లు మాత్రమే సాధించారు. ఆ సమయంలో కీలక ఇన్నింగ్స్​ ఆడాడు మరో ఎండ్​ ఓపెనర్​ సామ్​ ఫానింగ్​. 127 బంతులాడి 75 రన్స్​ చేశాడు. పాట్రిక్​ రో 41 బంతుల్లో 21, స్కాట్​ 75 బంతుల్లో 35 పరుగులు చేసి చక్కటి సహకారం అందించారు. భారత బౌలర్లను ధాటిగా ఎదుర్కొని కాసేపు భయపెట్టిన సామ్..​ విజయానికి 79 పరుగుల దూరంలో పెవిలియన్​ చేరడంతో ఆసీస్ పరాజయం ఖాయమైంది. ప్రత్యర్థిని 43.3 ఓవర్లలో 159 పరుగులకే చుట్టేశారు భారత బౌలర్లు.

యశస్వి, అథర్వ అర్ధశతకాలు...

తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమిండియా 50 ఓవర్లకు 9 వికెట్ల నష్టానికి 233 పరుగులు చేసింది. ఓపెనర్‌ యశస్వి జైశ్వాల్‌ (62; 82 బంతుల్లో 6ఫోర్లు, 2 సిక్సర్లు), అథర్వ అంకోలేకర్‌ (55*; 54 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్సర్​) అర్ధ శతకాలతో రాణించారు.

టాప్‌ ఆర్డర్‌లో దివ్యాన్ష్‌ సక్సేనా (14), తిలక్‌ వర్మ (2), ప్రియమ్‌ గార్గ్‌ (5) విఫలమవ్వడం వల్ల భారత్‌ కష్టాల్లో పడింది. ఈ క్రమంలో ధ్రువ్‌ జురెల్‌ (15; 48 బంతుల్లో 1 ఫోర్​), సిద్దేశ్‌ వీర్‌ (25; 42 బంతుల్లో 4ఫోర్లు)తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. మరో వికెట్‌ పడకుండా అడ్డుకున్నాడు. ఆ తర్వాత అథర్వ అజేయ అర్ధశతకం సాధించడం వల్ల భారత్‌ స్కోరు 200 దాటింది. చివర్లో రవి బిష్ణోయ్‌ (30; 31 బంతుల్లో 1ఫోర్, 1 సిక్సర్​) సమయోచితంగా ఆడి ఆసీస్ లక్ష్యాన్ని 234కు తీసుకెళ్లాడు.

Last Updated : Feb 28, 2020, 8:01 AM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details