భారత్-ఆస్ట్రేలియా మధ్య డే/నైట్ టెస్టు కోసం ఎదురుచూస్తోన్న అభిమానులకు శుభవార్త. త్వరలోనే మీ కోరిక నెరవేరనుంది. ఈ ఏడాది చివర్లో ఆసీస్ గడ్డపై టీమిండియా పింక్ బాల్ టెస్టు ఆడనుంది. దీనిపై స్పష్టతనిచ్చాడు బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ. దీంతో పాటు మరో బంపర్ వార్తను క్రికెట్ అభిమానులకు వినిపించాడు దాదా. ఇంగ్లాండ్తోనూ ఓ డే/నైట్ టెస్టు ఉంటుందని తెలిపాడు.
"అవును. ఆస్ట్రేలియాలో టీమిండియా డే/నైట్ టెస్టు ఆడుతుంది. త్వరలోనే అధికారిక ప్రకటన చేస్తాం. భారత్లో ఇంగ్లాండ్తో జరిగే టెస్టు సిరీస్లో రెండో మ్యాచ్ డే/నైట్ మ్యాచ్గా నిర్వహిస్తాం. ఇకనుంచి ప్రతి సిరీస్లోనూ ఓ డే/నైట్ టెస్టు ఉండేలా చూస్తాం."
-సౌరభ్ గంగూలీ, బీసీసీఐ అధ్యక్షుడు